Sports
ప్రస్తుతం రోహిత్తోపాటు క్రికెట్ ఆడుతున్నవారిలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల జాబితాలో అతని స్థానం 9. డేవిడ్ వార్నర్ 312 సిక్సులతో 11వ స్థానంలో, 294 సిక్సులతో మన కోహ్లీ 12వ స్థానంలో ఉన్నాడు.
2024- టీ-20 ప్రపంచకప్ ను భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ జంట రికార్డులతో మొదలు పెట్టాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినంత పని చేశాడు.
సంచలనాలకు మరో పేరైన పసికూన ఐర్లాండ్ తో భారత్ తలపడడం ఇది 8వసారి. మొత్తం ఎనిమిదిమ్యాచ్ ల్లోనూ ఐర్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా భారత్ 8-0 రికార్డుతో పైచేయి సాధించింది.
ఐసీసీ-2024 టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటను భారత్ ఈరోజు ప్రారంభించనుంది.న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే తొలిరౌండ్లో ఐర్లాండ్ తో పోటీపడనుంది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మ్యాచ్ ల టికెట్ల ధరలు నింగినంటాయి. భారత కరెన్సీలో 9 లక్షల రూపాయల ధర పలుకుతోంది.
టీ20 ప్రపంచకప్లో 20 జట్లంటే అందులో సగం పసికూనలే. నమీబియా, ఒమన్, కెనడా, అమెరికా, పపువా న్యూగినియా .. ఈ జట్లన్నీ పెద్ద జట్లకు రికార్డుల పంట పండించుకోవడానికే పనికొస్తాయని భావిస్తున్నారు.
2024-పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో పతకాల వేటకు భారత్ అరడజను మంది బాక్సర్లతో బరిలోకి దిగుతోంది.
భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని మరో మూడు టీ-20 ప్రపంచకప్ రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరియర్ లో ఆఖరి టీ-20 ప్రపంచకప్ కు విరాట్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ ..2007 తరువాత మరో ప్రపంచకప్ కోసం తహతహలాడుతోంది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ల చరిత్రలోనే ఓ అసాధారణ రికార్డుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉరకలేస్తున్నాడు. వరుసగా 9వ ప్రపంచకప్ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు.