Sports

ప్యారిస్ ఒలింపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఇది వరకే కాంస్య పతకం గెలిచిన మను, ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో నూ కాంస్యం సాధించింది.

2024- మహిళా ఆసియాకప్ క్రికెట్ ఫైనల్స్ కు శ్రీలంకలోని డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఏడుసార్లు విజేత భారత్ 8వ టైటిల్ కు గురి పెట్టింది.

2024- ఒలింపిక్స్ తొలిరోజు పోటీలలో భారత అథ్లెట్లు వివిధ క్రీడల్లో శుభారంభం చేశారు. మహిళల పిస్టల్ షూటింగ్ మెడల్ రౌండ్ కు మను బాకర్ అర్హత సంపాదించింది.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ వినూత్నంగా ప్రారంభమయ్యాయి. రెండువారాలపాటు సాగే ఈ క్రీడల పండుగలో 205 దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు.

పారిస్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలకు గురిపెట్టింది. 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడల్లో పతకాలవేటకు దిగుతోంది.