Sports
ఆర్చరీ స్టార్ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ వెన్నంకు ఏపీ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం తెలిపింది. గ్రూప్-1 హోదాలోని డిప్యుటీ కలెక్టర్ పోస్టును ఆమెకు ఇవ్వడానికి మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. భారత మహిళా స్టార్ ఆర్చర్లలో ఒకరైన జ్యోతి సురేఖ ఇటీవల అంతర్జాతీయంగా నిలకడగా రాణిస్తోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్లలో అనేక పతకాలు గెలిచి దేశ ఖ్యాతిని […]
భారత నవతరం క్రికెట్ అసాధారణ ఆటగాళ్లలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా. కొద్దిరోజుల క్రితమే విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 11 సంవత్సరాల కెరియర్ పూర్తి చేసుకొంటే… మూడుఫార్మాట్ల మొనగాడు, భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ..తన 15 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేయగలిగాడు. 2007 నుంచి 2022 వరకూ…. రోహిత్ శర్మ ..ముంబైలోని ఆంధ్ర సంతతికి చెందిన అసాధారణ క్రికెటర్. ఈ హిట్ మ్యాన్ క్రికెట్ కెరియర్ లో జూన్ 23 […]
రెండేళ్లకో..మూడేళ్లకో విశాఖ వేదికగా జరిగే టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లతో ఇప్పటి వరకూ ఊరట పొందుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల కోసం… ఆంధ్ర ప్రీమియర్ టీ-20 లీగ్ కు కొద్దిరోజుల్లో విశాఖ వేదికగా తెరలేవనుంది. జూల్ 6 నుంచి 17 వరకూ 11 రోజులపాటు విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా నిర్వహించే ఈ ప్రారంభలీగ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఏపీఎల్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్… ఇప్పటికే […]
ఇతిహాస క్రీడ చదరంగానికి, భారత్ కు అవినాభావ సంబంధమే ఉంది. వేల సంవత్సరాల క్రితమే భారతగడ్డపై రూపుదిద్దుకొన్న మేధో క్రీడ చదరంగం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలకు విస్తరించింది. అంతర్జాతీయ క్రీడాంశాలలో ఓ ప్రధాన క్రీడగా ఉన్న చదరంగం పురుషుల, మహిళల వ్యక్తిగత పోటీలతో పాటు… టీమ్ విభాగంలో సైతం అంతర్జాతీయ చదరంగ సమాఖ్య పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. వివిధ దేశాలకు చెందిన జాతీయ జట్ల మధ్య రెండేళ్లకోమారు..చెస్ ఒలింపియాడ్ పేరుతో […]
భారత్- దక్షిణాఫ్రికా జట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరాట వర్షం దెబ్బతో కేవలం 3.3 ఓవర్ల ముచ్చటగా ముగిసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ నిర్ణయాత్మక ఆఖరి పోరాటం వర్షంతో రద్దు కావడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. దీంతో రెండుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. భారత కుర్రాళ్ల పోరాటం… కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ […]
టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి నాలుగు మ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో రెండు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో విజేతను నిర్ణయించే ఆఖరాటకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరు రెండుజట్లకూ చావోబతుకో అన్నట్లుగా మారింది. ఆత్మవిశ్వాసంతో […]
భారత్ – దక్షిణాఫ్రికాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ నీకో రెండు, నాకో రెండు అన్నట్లుగా సాగుతోంది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన కీలక నాలుగో టీ-20 సమరంలో ఆతిథ్య భారత్ అతిపెద్ద విజయంతో సమఉజ్జీగా నిలిచింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ షో… సిరీస్ చేజారకుండా ఉండాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో కీలక టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగి..20 ఓవర్లలో […]
న్యూయార్క్ వేదికగా ఆగస్టు 29 నుంచి జరిగే 2022 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ లో రష్యా, బైలో రష్యా క్రీడాకారులను అనుమతించాలని అమెరికన్ ఓపెన్ టెన్నిస్ సమాఖ్య నిర్ణయించింది. ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడిన రష్యన్, దానికి మద్దతుగా నిలిచిన బైలోరష్యన్ క్రీడాకారులపై వింబుల్డన్ నిర్వాహకులు నిషేధం విధించిన నేపథ్యంలో.. అమెరికన్ టెన్నిస్ సమాఖ్య ఈ సంచలన నిర్ణయం తీసుకోడం విశేషం. క్రీడలతో రాజకీయాలా? పొరుగుదేశం ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను […]
స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి- ఏసీఏ స్టేడియం భారత్ కు అచ్చొచ్చిన క్రికెట్ వేదికగా మరోసారి నిరూపించుకొంది. టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో నెగ్గితీరాల్సిన పోరులో భారత్ 48 పరుగుల భారీవిజయంతో.. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో చిత్తుగా ఓడిన భారతజట్టు..విశాఖ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో మాత్రం చెలరేగి ఆడింది. టాస్ […]
వచ్చే ఐదేళ్లపాటు (2023-2027) జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారహక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ కాసుల పంట పండించుకొంది. సీజన్ కు రెండుమాసాలపాటు.74 మ్యాచ్ లుగా సాగే ఈటోర్నీలో మ్యాచ్ కు సగటున 57 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనుంది. మొత్తం మీద 48వేల 390 కోట్ల రూపాయల రికార్డు మొత్తాన్ని ఆర్జించనుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సంస్థ.. డిజిటల్ ప్రసారహక్కులను 20 వేల కోట్ల 500 కోట్ల రూపాయల ధరకు దక్కించుకొంటే..మ్యాచ్ […]