Telugu Global
Science and Technology

మిడ్‌ రేంజ్‌ లో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్‌ ఫోన్లు

ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లతో తీసుకువచ్చిన కొరియన్‌ సంస్థ

మిడ్‌ రేంజ్‌ లో అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్‌ ఫోన్లు
X

మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ లవర్స్‌ కోసం కొరియన్‌ దిగ్గజ మొబైల్‌ సంస్థ శాంసంగ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 'ఏ' సిరీస్‌ లో కొత్తగా రెండు ఫోన్లను తీసుకువచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్‌ను రెండు వేరియంట్లతో తీసుకువస్తోంది. 8జీబీ ప్లస్‌ 128 జీబీ వేరియంట్‌ మొబైల్‌ ఫోన్‌ రూ.18,999లకు, 8జీబీ ప్లస్‌ 256 జీబీ వేరియంట్‌ మొబైల్‌ రూ.20,999లకు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. బ్లూ, బ్లాక్‌, గోల్డ్‌, లైట్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ మొబైల్‌ ఫోన్‌ లు తయారు చేస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ ఫామ్స్‌ తో పాటు రిటైల్‌ ఔట్‌ లెట్లలోనూ ఈ ఫోన్లను విక్రయానికి పెట్టింది. ఈ మొబైల్‌ ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ, అమోలెడ్‌ డిస్‌ ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌ తో ఇది పని చేయనుంది. ఈ మొబైల్‌ ఫోన్లలో స్టోరేజీని మైక్రో ఎస్డీ కార్డుతో 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. 50 మెగా పిక్సల్‌ మెయిన్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సన్‌, 2 మెగాపిక్సల్‌ మ్యాక్రో లెన్స్‌, 13 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరాలు ఇందులో ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ రెండు రోజుల పాటు లైఫ్‌ ఇస్తుంది. ఈ రెండు వేరియంట్ల ఫోన్లకు ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ అప్‌ డేట్లు కల్పించారు.

First Published:  18 Oct 2024 11:05 AM GMT
Next Story