సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్ప్రెస్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్లోని నాగాల్పూర్ స్టేషన్ వద్ద రైలు పట్టాలు తప్పడంతో నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి .ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సౌత్-ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు. పట్టాలు తప్పిన వాటిల్లో రెండు ప్రయాణికుల బోగీలు కాగా.. ఒక పార్సిల్ వ్యాన్ అని అధికారులు తెలిపారు.
Add A Comment