National

దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.20వేల కోట్లను జమ చేసేలా.. పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులను ముంబైలోప్రధాని మోదీ విడుదల చేశారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తీర్పును సమీక్షించాలంటూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించడంతో పాటు ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబిల్‌ ఆయిల్‌- ఆయిల్‌ సీడ్స్‌’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.