Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, September 15
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    2025లో జనగణనకు సిద్ధమౌతున్న కేంద్రం

    By Raju AsariOctober 28, 20241 Min Read
    2025లో జనగణనకు సిద్ధమౌతున్న కేంద్రం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమౌతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమౌతుందని, అది 2028 కి ముగుస్తుందని వెల్డించాయి.

    ప్రతి పదేళ్లకొకసారి ఆనవాయితీగా నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. రాష్ట్రాల వారీగా, జాతీయస్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడానికి ఈ జనగణనే కీలకం. కొవిడ్‌ సంక్షోభంతో 2021 సెన్సస్‌కు ప్రతిబంధకంగా మారింది. తర్వాత ఈ ప్రక్రియ వాయిదా పడుతున్నది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొన్ని నెలల కిందట మాట్లాడుతూ.. తగిన సమయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తాం. దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా జరుగుతుందో నేను ప్రకటిస్తాను. ఈ సారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో ఈ సర్వే ఉంటుందని ఆయన వెల్లడించారు.

    ఇప్పటికీ 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బైటపడ్డారన్న నీతి ఆయోగ్‌ లెక్కలపై సామాజికవేత్తలు మండిపడ్డారు. సరైన లెక్కలు లేకుండా ఈ ప్రకటన చేయడంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ అంశం కూడా దీనితో ముడి పడి ఉండటంతో విపక్షాల నుంచి ఒత్తి వస్తున్నది. మరోవైపు కులగణన నుంచి ప్రతిపక్షాల నుంచి చాలా డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జనగణనపై వార్తలు రావడం గమనార్హం. అయితే దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది. 

    Begin Process Of Nationwide Census Central Government
    Previous Articleసీ-295 విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాని
    Next Article మోమోస్‌ తిన్న 20 మందికి తీవ్ర అస్వస్థత.. ఒకరు మృతి
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.