Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    కేంద్రం ఓకే అంటే ముందస్తు ఎన్నికలకు మేం రెడీ : తలసాని

    By SarviJuly 2, 20221 Min Read
    కేంద్రం ఓకే అంటే ముందస్తు ఎన్నికలకు మేం రెడీ : తలసాని
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా అందుకు సిద్దమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను కూడా మహారాష్ట్ర మోడల్‌గా చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. మేం ఎవరికీ భయపడటం లేదని.. వాళ్లు సై అంటే ముందస్తుకు రెడీ అని అన్నారు. దేశ ప్రజలందరూ మోడీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

    తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిసాల్వ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. వాళ్లు ముందస్తు పెట్టినా, జమిలీ ఎన్నికలు పెట్టినా మేం భయపడం. కలిసే ఎన్నికలకు పోదాం. మీరు సై అంటే మేమూ సై, దమ్ముంటే ఎన్నికల్లో మాతో తలపడండి అని తలసాని సవాలు విసిరారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ సీఎంలు, మంత్రులు, నాయకులు కార్యవర్గ భేటీ పేరుతో హైదరాబాద్‌కు టూరిస్టులుగా వచ్చారు. వారిని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడి అభివృద్ధిని చూసి.. వెళ్లి మీ రాష్ట్రంలో కూడా ఇలా చేయండి అని తలసాని సలహా ఇచ్చారు.

    తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధానికి స్వాగతం పలకడానికి వచ్చానని అన్నారు. ఇక ఫ్లెక్సీల విషయం జీహెచ్ఎంసీ చూసుకుంటుంది. అక్రమంగా పెడితే జరిమానాలు తప్పవు. టీఆర్ఎస్ ప్లీనరీ సమయంలో కూడా జీహెచ్ఎంసీ ఫైన్లు వేసింది. ఒక మంత్రికి కూడా జరిమానా వేశారని గుర్తు చేశారు. బీజేపీ ఆఫీసు వద్ద కేసీఆర్ పేరుతో డిజిటల్ హోర్డింగ్ పెట్టిన తర్వాతే ‘బై బై మోడీ’ అంటూ ఫ్లెక్సీలు వచ్చాయని తలసాని అన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడానికి చేసి ర్యాలీ కేవలం శాంపిల్ మాత్రమేనని.. ముందు మరింత ఉందని తలసాని చెప్పారు.

    Central Government early elections
    Previous Articleమేకిన్ ఇండియా పెద్ద జోక్‌
    Next Article ఆమ్ ఆద్మీ బాటలో జనసేన.. బీజేపీతో బంధం తెగినట్టేనా..?
    Sarvi

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.