Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    ప్రధాని పదవికోసం కాదు.. ప్రజల్లో చైతన్యం కోసం

    By SarviJune 13, 20221 Min Read
    ప్రధాని పదవికోసం కాదు.. ప్రజల్లో చైతన్యం కోసం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని, చైనాతో సమానంగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్దిలో వెనుకబడి ఉందని, దీనికి కారణం పాలకులేనన్నారాయన. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్, ఇప్పుడు దేశం మొత్తం అలాంటి అభివృద్ధికోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రధాని పదవి కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం లేదని, దేశ ప్రజలను చైతన్య పర్చడానికేనని చెప్పారు.

    ప్రత్యామ్నాయం కోసం ప్రజల చూపు..

    అధికారం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోందని, మరోవైపు ఆ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కి నాయకుడే లేరని ఎద్దేవా చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తూన్నారని అన్నారు. తెలంగాణ పోరాట సమయంలో కేసీఆర్ ని చులకనగా మాట్లాడారని, భవిష్యత్తులో లో కేంద్ర రాజకీయాల్లో కూడా కేసీఆర్ విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.

    కేంద్రంలో సరైన నాయకత్వం కావాలంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించాలన్నారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 70 ఏళ్లుగా దేశాన్ని పరిపాలించినా అభివృద్ధి శూన్యం అని చెప్పారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి చేసుకునే తెలంగాణ.. ఇప్పుడు దేశానికే బియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చి దిద్దారన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని దేశాన్ని సైతం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే అందుకు సమర్థుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. తెలివితేటలు, నైపుణ్యంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు.

    CM KCR minister srinivas goud
    Previous Articleబీఆర్ఎస్ కి ఏపీలో ఉండవల్లి నాయకత్వం వహిస్తారా..?
    Next Article కాంగ్రెస్ నిరసనకి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి.. ఇది కదా రాజకీయం అంటే..
    Sarvi

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.