Telugu Global
NEWS

నిఫా వైరస్ కలకలం.. మళ్లీ మాస్కులు తప్పనిసరి

దేశంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంగా కేరళలో వైరస్ వ్యాప్తితో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

నిఫా వైరస్ కలకలం.. మళ్లీ మాస్కులు తప్పనిసరి
X

దేశంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంగా కేరళలో వైరస్ వ్యాప్తితో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ వైరస్ తో 23ఏళ్ల వ్యక్తి గత సోమవారం మృతిచెందారు. దీంతో నిఫా వైరస్‌ వ్యాప్తిని నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మాస్కులను మళ్లీ తప్పనిసరి చేశారు. తర్వాత ఆదేశాలు వచ్చేంత వరకూ మాస్కుల నిబంధన కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు చనిపోయిన వ్యక్తి శాంపిల్స్ ను పుణెలోని ల్యాబ్ కు పంపారు. టెస్టుల అనంతరం సదరు వ్యక్తికి నిఫా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. చినిపోయిన వ్యక్తితో దగ్గరగా ఉన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు వైద్యారోగ్య, రెవెన్యూ శాఖ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నిఫా వైరస్‌ ప్రొటోకాల్‌ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. తిరువలి పంచాయతీ పరిధిలోని నాలుగు వార్డుల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకే చోట ఎక్కువ మంది ఉండరాదని వెల్లడించారు.

నిఫా వైరస్ ను తొలిసారి 1999 లో గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. దీన్నే జునోటిక్ అని అంటారు. నిఫా ఉండే జీవుల లిస్ట్ లో పందులు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు ఉన్నాయి. ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాల్లో ఇవి సహజంగానే ఉంటాయ. ఈ గబ్బిలాలు పండ్లపై వాలితే వాటిని తీసుకోవడం ద్వారా ఈ వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా ఒక రోగి స్రావాల ద్వారా నుంచి మరొకరి వ్యాపిస్తుంది.

First Published:  16 Sep 2024 11:33 AM GMT
Next Story