Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    కేసీఆర్ జాతీయ పార్టీ.. వైఎస్ జగన్ కలయికపై ఆసక్తికరమైన చర్చ

    By Telugu GlobalSeptember 12, 20223 Mins Read
    కేసీఆర్ జాతీయ పార్టీ.. వైఎస్ జగన్ కలయికపై ఆసక్తికరమైన చర్చ
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కూటమి కంటే పార్టీ ఏర్పాటే కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పటికే కేసీఆర్ వెల్లడించారు. దసరా లోపు ఈ పార్టీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. జాతీయ పార్టీ, అందులో తన పాత్రపై ప్రజలకు వివరించారు. ఇక టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నట్లు చెబుతున్నారు. కంట్రీ మొత్తం కేసీఆర్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోందని అంటున్నారు.

    ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సానుకూలంగా స్పందించారు. తాజాగా కుమారస్వామి కూడా దేశానికి కేసీఆర్ అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అవసరమైనప్పుడు ఎంకే స్టాలిన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా కేసీఆర్‌తో కలసి వస్తారని భావిస్తున్నారు. కానీ, మరో తెలుగు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి జగన్.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో కలసి అడుగులు వేస్తున్నారు. పలుమార్లు ఆ ప్రభుత్వానికి పార్లమెంటులో బేషరతుగా మద్దతు కూడా ప్రకటించారు. కేసీఆర్ కూడా ఎప్పుడూ వైఎస్ జగన్, వైసీపీ ఊసే ఎత్తలేదు.

    తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ఆయన అన్నారు. అలా అనడం వెనుక ఆంత్యర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి కేసీఆర్-వైఎస్ జగన్ మధ్య మొదటి నుంచి సత్సంబంధాలే ఉన్నాయి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనను కేసీఆర్ వెనకేసుకొని వచ్చారు. సీఎం అయ్యాక జగన్.. ఏకంగా ప్రగతి భవన్ వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం విభేదించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలు, కృష్ణా జలాల్లో వాటా, విభజన చట్టంలోని హామీలు, తాజాగా విద్యుత్ బకాయిల విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య విభేదాలు నెలకొన్నాయి.

    వైఎస్ జగన్ ఏనాడూ తెలంగాణతో ఈ విషయాలను చర్చించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం పలుమార్లు లేఖలు రాశారు. అదే సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలసి వినతిపత్రాలు అందించారు. తాజాగా కేసీఆర్ మాత్రం ఏపీనే తెలంగాణకు బకాయి పడిందని లెక్కలతో సహా తెలంగాణ అసెంబ్లీలో వివరించారు. కానీ, ఆ సమయంలో వైఎస్ జగన్ పేరు తీయలేదు. రాజకీయంగా టీఆర్ఎస్-వైసీపీ ఏనాడూ విభేదించుకోలేదు. కేవలం బీజేపీ విషయంలోనే టీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ తీసుకోగా, వైసీపీ మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తోంది.

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ కూడా బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్‌లో వైఎస్ జగన్ కూడా కేసీఆర్ పార్టీతో కలసి వస్తారని గంగుల వ్యాఖ్యానించినట్లు చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా ఇరు పార్టీలను కలపడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. జగన్.. బీజేపీకి సహకరించడం కేవలం తాత్కాలికమేనని.. ఒకసారి కేసీఆర్ పార్టీ ప్రకటన చేశాక.. ఆయన కూడా చేతులు కలపడం ఖాయమేననే చర్చ జరుగుతుంది.

    ఇరు రాష్ట్రాలు కలిస్తే తప్పకుండా ఏపీకీ ప్రత్యేక హోదా వస్తుందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో కలవడంలో తప్పులేదని, ఆయన ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారని గత ఎన్నికల ప్రచారంలో జగన్ కూడా అన్నారు. తాజాగా గంగుల వ్యాఖ్యలతో వీరి కలయికకు ఎంతో సమయం లేదని, త్వరలోనే ఒకే వేదికపైకి వస్తారని అనుకుంటున్నారు. వైసీపీ కనుక టీఆర్ఎస్‌తో జతకడితే కేంద్రంలోని బీజేపీకి తిప్పలు తప్పవని అంటున్నారు. దక్షిణాదిలో ఉన్న బలమైన పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీకి బలమైన కూటమిగా మారుతుందని, కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగే అంత బలం కూడా వస్తుందని విశ్లేషిస్తున్నారు. పీకే కూడా ఇదే స్ట్రాటజీని గతంలో కేసీఆర్‌కు చెప్పారని.. ఇప్పుడు అదే అమలు చేస్తున్నట్లుగా కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికల నాటికి కేసీఆర్-వైఎస్ జగన్ కలిస్తే.. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం తప్పకుండా వస్తుంది.

    CM KCR National Party
    Previous Articleఆర్ఎస్ఎస్ నిక్కర్ కి నిప్పు.. బీజేపీ కస్సుబుస్సు..
    Next Article డ్రాగన్ కంట్రీ మామూలుగా లేదుగా.. విదేశీ మీడియాను కూడా కబ్జా చేస్తోంది.!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.