Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, September 10
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం ఫైర్

    By Vamshi KotasOctober 29, 20242 Mins Read
    కాంగ్రెస్ పార్టీపై  ఎన్నికల సంఘం ఫైర్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపణలు చేస్తుండడంపై భారత ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ప్రతికూల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ విమర్శించింది.కాంగ్రెస్ పార్టీపై భారత ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా శాసన సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఇప్పటికైనా ఎన్నికల అనంతరం నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఈసీ లేఖ రాసింది. ‘ఓటింగ్, కౌంటింగ్ సమయంలో బాధ్యతారాహిత్య ఆరోపణలు చేయడం సరికాదు.ప్రధానంగా హర్యానా ఎన్నికల రిజల్ట్స్ వెలువడిన అక్టోబర్ 8న అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ దాదాపు 2 గంటలపాటు చాలా నెమ్మదించాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. హర్యానా ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రతీ చర్య కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేదా ఏజెంట్ల పర్యవేక్షణలోనే జరిగినట్టు పేర్కొంది.

    ఈ మేరకు మంగళవారం మొత్తం 1,600 పేజీలతో కూడిన అధికారిక ప్రతిస్పందనను విడుదల చేసింది. ఓట్లు వేసేటప్పుడు, కౌంటింగ్ సమయంలో నిరాధారమైన, సంచలనాత్మక ఫిర్యాదులు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం హెచ్చరించింది. బాధ్యతా రహితమైన ఈ ఆరోపణలు ప్రజల్లో అశాంతి, అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయని, గందరగోళానికి దారితీస్తాయని ఈసీ పేర్కొంది. అనవసరమైన ఈ తరహా ఫిర్యాదుల ధోరణిని అరికట్టడానికి దృఢమైన, కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరింది. ఇక హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా కాంగ్రెస్ వాదనలను ఖండించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ ఈసీకి పలు ఫిర్యాదులు చేసింది. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని పేర్కొంంది. అంతేగాక 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లు కొన్ని కేంద్రాల్లో 99 శాతం బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుండగా, మరికొన్ని 60-70, 80 శాతం కంటే తక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తున్నాయని దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈసీ సమాధానం ఇచ్చింది. అవన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది.

    Election Commission of India Mallikarjuna Kharge
    Previous Articleహిజ్బుల్లా నూతన చీఫ్‌గా షేక్ నయీం ఖాసీమ్
    Next Article మంధాన సెంచరీ..భారత్‌ చేతిలో కివీస్‌ను చిత్తు .. సిరీస్‌ కైవ‌సం
    Vamshi Kotas

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.