National

కిడ్నీ రాకెట్‌లో సూత్రధారి రాంప్రసాద్‌ అని సిట్‌ అధికారులు గుర్తించారు. అతను కేరళలోని అలువాకు చెందిన మధుతో కలిసి ఈ దందా నడిపినట్లు తమ దర్యాప్తులో తేల్చారు.

బాలీవుడ్ యాక్టర్ నకుల్ మెహతా సైతం ఈ వీడియో స్పందించారు. బాలయ్య ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించకూడదన్నారు.

ఈ దాడిలో అక్కడికక్కడే 8 మంది రక్తసంబంధీకులు చనిపోయారు. అప్పటిదాకా పచ్చగా కనిపించిన పెళ్లి పందిరి దాడితో రక్తసిక్తమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు.

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. ఇక కోచ్‌ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఇష్టపడకపోవడంతో కొత్త కోచ్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టింది బీసీసీఐ.

ఆసీస్ ఆటగాళ్లు హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉంటే కప్పు మనదే అన్న సెంటిమెంట్‌ కూడా ఫ్యాన్స్‌ నుంచి వినిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడే 2009లో హైదరాబాద్‌ కప్పు గెలిచింది.

కేరళకు చెందిన ఓ ఐదేళ్ళ బాలిక వారం రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆ చిన్నారి అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ‘అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌’ (బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా) వ్యాధితో మరణించడంతో మరోసారి బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా గురించి చర్చ మొదలయ్యింది.

ధోనీ రిటైర్మెంట్ నిర్ణ‌యం ఆయ‌న ఇష్ట‌మేన‌ని సీఎస్కే యాజ‌మాన్యం చెబుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి త‌మ‌కేమీ చెప్ప‌లేద‌ని.. ఈసీజ‌న్‌లో అత‌ను చాలా ఫిట్‌గా కూడా ఉన్నాడ‌ని గుర్తుచేసింది

మొన్న‌టి మినీ వేలంలో ఆర్సీబీ య‌ష్ ద‌యాల్‌ను తీసుకుంది. చావో రేవో తేలిపోయే ఓవ‌ర్‌లో అత‌నికి బంతి ఇచ్చి మ‌రింత ఆత్మ‌విశ్వాసం పెంచాడు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌.