National

అయోధ్యలోని 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కట్టడం 1992 డిసెంబర్‌ 6న కరసేవకుల చేతిలో నేలమట్టమైంది. ధ్వంసమైంది మసీదు మాత్రమే కాదు ఈ దేశపు గణతంత్ర వ్యవస్థ, లౌకిక వ్యవస్థ. వాటి పునాదులే కదిలిపోయాయి.

Marriage dates in December 2022: సెప్టెంబ‌ర్ 22న ప్రారంభ‌మైన మూఢం న‌వంబ‌ర్ 27 వ‌ర‌కు కొన‌సాగింది. దీంతో డిసెంబ‌ర్‌లో శుభ ముహూర్తాల‌కు డిమాండ్ ఏర్ప‌డిందని పురోహితులు చెబుతున్నారు.

నూత‌న సిల‌బ‌స్‌ను జేఈఈ మెయిన్‌తో అనుసంధానం ఉండేలా రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కోచింగ్ తీసుకొని విద్యార్థులు కూడా విజ‌యం సాధించ‌డం సిల‌బ‌స్ మార్పు ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని చెప్పారు.

కళామతల్లికి ఆయన చేసిన సేవలు మహోన్నతం అని అన్నారు. చిరంజీవికి లభించిన పురస్కారం తెలుగు సినీ రంగానికి గర్వకారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

”ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి”. అని ప్రసిద్ధ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు. కేసీఆర్ ఇదే తత్వంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.

ఎంటెక్ లో 100కి కనీసం 40సీట్లు కూడా భర్తీ కావడంలేదు. దీంతో యాజమాన్యాలు కూడా తమ కాలేజీల్లో ఎంటెక్ సీట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం 6700 ఎంటెక్ సీట్లు తగ్గాయి. అందులో ఏపీ నుంచి 915 సీట్లు ఉన్నాయి.

ఎనిమిదేళ్లకు పైనుంచి బీజేపీ కేంద్రంలో వైభోగాన్నిఆస్వాదిస్తోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అయితే నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా బీజేపీ మనుగడ మీద అనుమానపు క్రీనీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి మోదీ ప్రధాని అయిన 2014 నుంచే ఉన్నా గతేడాది కాలంలో మరింత తీవ్రమైంది.

జాతీయత పేరుతో దేశభక్తి కొంగజపం చేస్తున్న బిజెపి విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి. చేయడానికి పనుల్లేక అర్ధాకలితో అలమటించే వారికి బిజెపి బూటకపు జాతీయతా నినాదాలు ఒరగబెట్టేదేమీ లేదు. కనుకనే ఆర్థిక, రాజకీయ రంగాలలో జనం కోసం కాంగ్రెస్‌ ఏం చేయబోతున్నదో నిర్దిష్టంగా, కచ్చితంగా చెప్పాలి. తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి, నిజమైన జాతీయతావాదానికి బలం చేకూరుతుంది.

బీజేపీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎట్లా అవతరించిందో, అందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఎట్లా ప్రధాన కారణమైందో.. చాలా లోతుగా అధ్యయనం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది.

ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం పాకిస్తాన్‌లోని కరాచిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంగళవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలు దేరిన విమానం, మరి కొంతమంది ప్యాసింజర్స్‌ను ఎక్కించుకోవడానికి ముంబై చేరుకున్నది. అనంతరం దుబాయ్ వెళ్లడానికి టేకాఫ్ తీసుకుంది. అయితే గాల్లోకి ఎగిరిన కొంతసేపటి తర్వాత ఇంధన వ్యవస్థలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్‌కి వెళ్తున్న బోయింగ్ 737-8 మ్యాక్స్ (వీటీ-ఎంఎక్స్‌జీ) రకం విమానాన్ని ఢిల్లీ – దుబాయ్ మధ్య ఎస్‌జీ-011 నెంబర్‌తో […]