Crime

టేపు రికార్డర్ ప్లగ్ ను కరెంటు సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా అది పేలింది. ఈ పేలుడులో జీతూ భాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూమిక తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

విజ‌య‌వాడ‌లో విషాదం చోటుచేసుకుంది. గురునాన‌క్‌న‌గ‌ర్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్ట‌ర్ శ్రీనివాస్, ఆయ‌న కుటుంబంలో మ‌రో న‌లుగురు ఒకేసారి మృతి చెందారు.

ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఒక‌దాన్నొక‌టి ఢీకొట్టాయి.

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణ సంఘటన జరిగింది. దొంగతనం చేస్తుండగా పట్టించాడని శేఖర్ అనే బాలుడిని నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. తరువాత సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్యాభర్తలిద్దరికీ కొన్నాళ్లుగా పడటం లేదు. 2019లో వీళ్లకు పెళ్లయింది. అప్పటి నుంచి మహిళను శారీరక, మానసిక, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్‌ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.

ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడికి వచ్చిన ఓ వ్యక్తి.. అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నట్లు నటించాడు. గర్భగుడిలో అపుడు ఎవరూ లేరు. చుట్టపక్కల చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని గర్భగుడిలోకి వెళ్లి మంగళసూత్రం దొంగిలించాడు.