Crime

నిద్రపోతున్న ఆ నలుగురిపై మట్టి మిద్దె పడటంతో ఏం జరిగిందో కూడా అర్థమయ్యేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు కూడా ఎవరూ గుర్తించలేకపోయారు.

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను ఇనుప గొలుసులతో కట్టేసి, సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు ఒక వ్యక్తి.

చెన్నైలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న మోహన్‌ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళుతుండేవాడు. అదే విధంగా రెండు రోజుల క్రితం తిరుపతికి వచ్చిన మోహన్‌.. బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలు దేవశ్రీ (13), నీరజ (10)లను స్కూల్‌ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద దింపి బయటికి వెళ్లాడు.

గౌతమ్, నజీర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు.

ఈ నెల 15న మచిలీపట్నంలో పని ఉందని బయటకు వెళ్లిన ఆయన.. తర్వాత కనిపించకుండా పోయారు. ఆయన ఫోన్‌ కూడా పని చేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 16వ తేదీన అందరూ జాగ్రత్త అంటూ భార్య ఫోన్‌కు మెసేజ్‌ పంపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం నిందితుడు పరారయ్యాడు.