కేజ్రీవాల్ను విచారించడానికి ఈడీకి అనుమతి
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేంద్రం చర్యలు
BY Raju Asari15 Jan 2025 9:29 AM IST

X
Raju Asari Updated On: 15 Jan 2025 9:35 AM IST
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను విచారించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధుల్ని విచారించడానికి ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్ లో ఆదేశించింది. ఈ మేరకు తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ను విచారించడానికి అనుమతి ఇవ్వడంతో కేంద్రం చర్యలు తీసుకున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Next Story