బంగారం కొనుగోలు చేసే మహిళలకు గుడ్ న్యూస్
పండుగ వేళ పసిడి కొనుగోలు చేసే మహిళలకు శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగాయి
BY Vamshi Kotas20 Oct 2024 5:46 AM GMT
X
Vamshi Kotas Updated On: 20 Oct 2024 5:46 AM GMT
పండుగ వేళ పసిడి కొనుగోలు చేసే మహిళలకు శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం, వెండి రేటు స్వల్పంగా పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,950 ఉండగా, ఆదివారం నాటికి రూ.200 పెరిగి రూ.80,150కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.97,660 ఉండగా, ఆదివారం నాటికి రూ.100 పెరిగి రూ.97,760కు చేరింది.
తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 420 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72, 800 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 1,07,000 గా నమోదు అయింది.
Next Story