Author: Sarvi

“పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన” అని పాడుకునే కరువు స్థితి నుండి పల్లె పల్లెన పచ్చనీ మాగాణిగా మారే స్థితికి చేరాము..!”తలాపున పారుతుంది గోదారి, తెలంగాణ భీళ్లు అన్నీ ఎడారి” అనే నాడు పాడుకునే దుస్థితి నుండి కాళేశ్వరం తో అద్భుత జల దృశ్యం ఆవిష్కరించబడింది..! “అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” అనీ సమైక్య రాష్ట్రంలో పాడుకునే దయనీయ స్థితి నుంచి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ మారింది.వలసలతో వలవల ఏడ్చిన కరువు […]

Read More

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నవతెలంగాణలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదికేడాది ఐటీ రంగంలో అద్భుతమైన వృద్ధి సాధ్యపడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఐటీ రంగంలో తెలంగాణ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి వెళ్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రెండో ఐసీటీ పాలసీ ప్రకటించిన తర్వాత పలు కంపెనీలు తెలంగాణను వెతుక్కుంటూ వచ్చాయి. తెలంగాణ ఐటీ గణాంకాలు క్లుప్తంగా.. – 2021-22 ఏడాదికి ఐటీ ఎగుమతుల విలువ 1,83,569 […]

Read More

ఆహారపు అలవాట్లు, ప్రజల జీవన శైలి మార్పుతో 60, 70 ఏళ్ల వయసులో రావాల్సిన రోగాలన్నీ ముందుగానే చుట్టుముడుతున్నాయి. 40 ఏళ్లకే బీపీ, షుగర్.. 50 దాటితే వృద్ధాప్యం.. ఇదీ నేటి పరిస్థితి. అందుకే రాజకీయ పార్టీలు కూడా 50 దాటితే వృద్ధాప్యపు పింఛన్ ఇస్తామంటూ ప్రజలకు ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే షుగర్, బీపీ వంటి వాటిని ముందస్తుగా గుర్తించి వైద్యం మొదలు పెడితే.. వాటి వల్ల వచ్చే ముప్పుని వాయిదా వేసుకోవచ్చని చెబుతుంటారు వైద్య నిపుణులు. […]

Read More

దావోస్ పర్యటన వివరాలను వెల్లడించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. అక్కడ తమకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. దావోసు సదస్సులో ఒక సంస్థ ప్రతినిధి .. వదరలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందట కదా అని ప్రశ్నించారని అమర్‌నాథ్ చెప్పారు. ఆ మాటతో తనకు చాలా బాధేసిందన్నారు. తన కళ్లలో నీరు తిరిగాయన్నారు. విశాఖపట్నం మునిగిపోతుందంటూ ఒక వర్గం మీడియా చేసిన ప్రచారం కారణంగానే ఈ ప్రశ్న ఎదురైందన్నారు. విశాఖ మునిగిపోతుందంటూ నగర ఇమేజ్‌ను దెబ్బతీశారని మంత్రి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి మేలు […]

Read More

ఏపీ జలవనరుల శాఖ టెండర్ల డాక్యుమెంట్లలో ఒక నిబంధనను చేర్చింది. ప్రస్తుతం ఏపీలో భారీగా పెండింగ్ బిల్లులున్నాయి. వాటి చెల్లింపులో తీవ్ర జాప్యం అవుతోంది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టు వెళ్లి.. బిల్లుల చెల్లింపునకు ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. బిల్లుల చెల్లింపునకు హైకోర్టు డెడ్‌లైన్లు కూడా పెడుతుండడంతో ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అధికారులకు కోర్టు నుంచి ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో ముందు జాగ్రత్తగా జలవనరుల శాఖ స్పెషల్ కండిషన్‌ ఆఫ్ నోట్‌ పేరుతో ఒక నిబంధనను చేర్చింది. ప్రభుత్వం […]

Read More

కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి డిమాండ్ చేసింది. రాయలసీమ సాగు నీటి సాధన సమితి నేతలు సిద్ధేశ్వరం అలుగు కోసం కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టారు. రాయలసీమ వెలుగుకోసం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వెంటనే మొదలు పెట్టాలని, అప్పటి వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని వారు స్పష్టం చేశారు. ఈ అలుగు నిర్మాణం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని […]

Read More

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పానన్నారు. గత ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయకుండా మరొకరికి మద్దతు ఇచ్చానని.. ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడంతో.. ఈసారి కూడా సుబ్బారాయుడిని రిక్వెస్ట్ చేసుకుని మద్దతు పొందాలన్న ఆలోచనతో కొందరున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇస్తున్నానని.. […]

Read More

ఇటీవల సీఎం జగన్ దావోస్ పర్యటనను టార్గెట్ చేసుకుని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా మాటల తూటాలు పేల్చారు. వాటన్నిటికీ ఇప్పుడు విజయసాయి బదులు తీర్చేశారు. అయ్యన్నపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. నిన్న లోకేష్ ని.. ఎలకేష్, బోకేష్ అంటూ ఘాటుగా విమర్శించిన విజయసాయి.. ఈరోజు అయ్యన్నపాత్రుడిని కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్ అంటూ దుయ్యబట్టారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో రికార్డింగ్ డ్యాన్స్ […]

Read More

విశాఖ రుషికొండ విధ్వంసం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్పిందని.. ఆ వివరాలను సుప్రీంకోర్టుకు అందజేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. విశాఖ సముద్ర తీరానికి అనుకుని ఉన్న రుషికొండ వద్ద.. గతంలో టూరిజం శాఖకు చెందిన కొన్ని నిర్మాణాలు ఉండేవి. వాటిని కూడా అక్కడ ప్రకృతికి విఘాతం కలగకుండా చిన్నచిన్నగా నిర్మాణాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఇప్పటికే ఉన్న టూరిజం కట్టడాలను మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించింది. […]

Read More

ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్ళలో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ వైరస్ కారణంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా ఎంతోమంది ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో మరణాల సంఖ్య అధికంగా నమోదయింది. కరోనాతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఇలా కరోనా వల్ల అనాథలుగా మారిన పిల్లలను […]

Read More