Author: Sarvi

పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఫేమ్, హాలీవుడ్ నటుడు జానీ డెప్, అతని మాజీ భార్య అంబర్ హర్డ్ మధ్య ఓ పరువునష్టం దావా కేసులో తీర్పు వెలువడింది. ఇరుపక్షాలు ఈ కేసులో పరిహారం పొందేందుకు అర్హులే అని చెప్తూనే.. జానీకి అనుకూలంగా ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ తీర్పు చెప్పింది. ఆరు వారాల పాటు సాగిన విచారణలో జానీ డెప్‌కు మాజీ భార్య అంబర్ హర్డ్ 13.5 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. అసలు […]

Read More

విమర్షకుల అందరి నోళ్ళను మూయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల చెక్, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్ లకు 2 కోట్ల రూపాయల చొప్పున చెక్ అందజేశారు ముఖ్యమంత్రి. పబ్లిక్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి, కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ మొగులయ్య, అంతర్జాతీయ […]

Read More

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్.. కేంద్రం నుంచి తెలంగాణకు నయాపైసా కూడా సాయం అందడం లేదన్నారు. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కోత పెడుతున్నారని విమర్శించారు. నిధులు కేటాయించాలని ప్రధానిని కోరినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కేంద్రంపై పోరాటాలు చేయాల్సి వస్తోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రం […]

Read More

కరోనా మహమ్మారి తర్వాత అన్ని కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దాంతో రెండేళ్ళపాటు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడిన చాలా మంది ఆఫీస్ కు రావడానికి ఇష్టపడటం లేదు. కరోనా భయం తగ్గిపోయి కార్యాలయాలన్ని తెరిచుకొని కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ ఆఫీస్ కు వచ్చే వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఈ విషయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కోపమొచ్చింది. తమ ఉద్యోగులందరూ ఆఫీస్ కు రావాల్సిందే […]

Read More

విజయవాడలో రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీ షీటర్లు కలిసి పనిచేస్తున్న తీరు విజయవాడ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గ్యాంగ్‌ల మధ్య ఏర్పడిన వివాదాలతో ఆ గ్యాంగ్‌లతోనే సంబంధాలున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు దీపక్ ఆకాశ్‌ హత్యకు గురయ్యాడు. ఇతడు పలు పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అదే సమయంలో విజయవాడలోని రౌడీషీటర్లతో కలిసి తిరిగేవాడు. వాంబేకాలనీకి చెందిన రౌడీషీటర్‌ శంకర్‌ అలియాస్ టోనీ తన ప్రేయసి తనతో సరిగా […]

Read More

తెలంగాణలో సర్వేల రాజకీయం నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ రంగంలోకి దిగిందో లేదో.. అప్పటి నుంచి ఏదో ఒక సర్వే పేరిట హల్‌చల్‌ నడుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్వేలు అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పీడీఎఫ్‌ ఫార్మాట్‌ సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 102 సీట్లు వస్తాయనేది ఇప్పుడు గులాబీ వాట్సాప్‌ గ్రూపుల్లో ఓ సర్వే రిపోర్టు హల్‌చల్‌ చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పెట్టిన ఈ సర్వే […]

Read More

టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసి పెద్ద కలకలం రేపిన దివ్యవాణి.. తాజాగా మరోసారి సెల్ఫీ వీడియో ద్వారా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుతో ఆమె భేటీ అయిన తర్వాత ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. బాబుతో భేటీలో ఏం జరిగిందనేది మీడియా సమావేశంలో సంపూర్ణంగా వివరిస్తానని చెప్పారు దివ్యవాణి. వారి మర్యాదలు తట్టుకోలేకపోయాను.. మహానాడులో తనకు అవమానం జరిగిందన్న స్టేట్ మెంట్లు, ఆ తర్వాత రాజీనామా వార్తలతో […]

Read More

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు పార్టీ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫుల్లుగా క్లాస్ పీకారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌ని నేతలకు హిత‌బోధ చేశారు. పార్టీలో విభేదాలపై మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయొద్దంటూ ఆయ‌న నేత‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ చింత‌న్ శిబిర్ తొలి రోజు స‌మావేశంలో ఆయన మాట్లాడారు ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై వాడీవేడిగా చ‌ర్చ సాగ‌గా… ఏదైనా స‌మ‌స్య ఉంటే నాలుగు గోడ‌ల మ‌ధ్య చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని […]

Read More

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి, అక్రమాలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు. నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోనే డబ్బులు పడిపోతున్నాయి. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచాలకు అలవాటు పడ్డ కొన్ని శాఖల ఉద్యోగులు తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు సీఎం జగన్ నడుం బిగించారు. ఇందులో భాగంగా అవినీతిపై […]

Read More

ఈ జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ ఎనిమిదేళ్ళలో తెలంగాణ సాధించిన అభివృద్ది ఏంటి ? తెలంగాణ రాష్ట్రం రాక ముందు తెలంగాణ వ్యతిరేకులు ప్రచారం చేసినట్టు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా ? కరెంట్ లేక చీకటి రాజ్యమై పోయిందా ? పెట్టుబడులు మొత్తం క్యూ కట్టి తెలంగాణ నుంచి వెళ్ళిపోయాయా ? అసలు తెలంగాణ వాళ్ళకు పరిపాలనే రాదన్న తెలంగాణ వ్యతిరేకుల మాటలు నిజమయ్యాయా ? లేక […]

Read More