Author: Sarvi

ప్రధానితో కార్పొరేటర్ల భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంత పెద్ద హోదాలో ఉన్న నరేంద్ర మోడీ స్వయంగా కార్పొరేటర్లను పిలిపించుకోవడం ఏంటని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. జీహెచ్ఎంసీలో గెలిచిన 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సహా ఇతర నాయకులు ప్రధానిని కలిశారు. అయితే, ప్రధాని వారితో ప్రత్యేకంగా భేటీ కావడానికి రాబోయే ఎన్నికలే లక్ష్యమని తెలుస్తున్నది. ఇటీవల […]

Read More

ఈసారి భారీగా టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోవచ్చన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్‌ తరపున పనిచేస్తున్న ఐ-ప్యాక్‌ సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, పార్టీల పరిస్థితులపై గ్రౌండ్‌ రిపోర్టు రెడీ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది?, వారిపై ప్రజల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది. ఒకవేళ అక్కడ సిట్టింగ్‌పై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎవరు సరైనవారు అన్న దానిపై వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 70 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను […]

Read More

పదో తరగతి పరీక్ష ఫలితాల శాతం తగ్గిపోవడాన్ని ఏపీలో విపక్షాలు రాజకీయ కోణంలోకి తీసుకొచ్చాయి. నాడు-నేడు విఫలమైందంటూ టీడీపీ మాట్లాడుతోంది. ఈ విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు పరీక్షలతో సంబంధం లేకుండా అందరినీ పాస్‌ చేయాలని టీడీపీ చెప్పదలుచుకుందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలు క్యాన్సర్‌లా పట్టుకుని.. ప్రభుత్వాన్ని ఆడిస్తూ పరీక్షలకు అర్థం లేకుండా చేశాయన్నారు. బిట్‌ పేపర్ అడ్డం పెట్టుకుని కాపీయింగ్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. […]

Read More

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు స్కీంపై ఎమ్మెల్యేల పెత్తనం పోనున్నది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ, ఇకపై ఎంపిక అధికారాన్ని ఆఫీసర్లకు అప్పజెప్పడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. ఒక వేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే, ఈ ఏడాది నుంచి గవర్నమెంట్ ఆఫీసర్లే లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉన్నది. నిరుడు దళిత […]

Read More

సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ రేప్‌ ఘటనపై దర్యాప్తు దాదాపు పూర్తయిందని ప్రకటించారు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్. మంగళవారం రాత్రి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. సీపీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ”బెంగళూరులో నివసించే ఒక బాలుడు.. స్కూల్‌ ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లో ఒక పార్టీ ఏర్పాటు చేయాలని ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. ఏ పబ్‌ బాగుంటుందో ఎంపిక చేయాలని కోరాడు. పార్టీ నిర్వహించాలన్న ప్లాన్‌ […]

Read More

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్దాలు చెప్పేందుకు ఢిల్లీ నుంచి ఎగేసుకువచ్చారని విమర్శించారు. రాజమండ్రికి కూతవేటు దూరంలో ఉన్న పోలవరం గురించి ఎందుకు మాట్లాడడం లేదు..?, ఆ ప్రాజెక్టుకు నిధులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారని.. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్ర అప్పు ఎంత ఉందో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ […]

Read More

తెలంగాణ కాంగ్రెస్ బలోపేతానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. నాయకుల ధోరణితో పార్టీ తీరు మారడం లేదు. కొన్ని నెలలుగా అధిష్టానం తరపున రాహుల్ గాంధీనే స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. వాళ్లకు అనేక సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే నాయకులు ఐక్యంగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రజల్లో ఉండే నేతలకే కాంగ్రెస్ తరపున టికెట్లు వస్తాయని కుండ బద్దలు కొట్టారు. ఆ తర్వాత వరంగల్ […]

Read More

క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ప్రతీ ఒక్కరు హడలిపోతుంటారు. ఒకసారి క్యాన్సర్ సోకితే దేహంలోని ఏ అవయవం అయినా నాశనం కావల్సిందే. క్యాన్సర్ చికిత్స కూడా అత్యంత ఖరీదైన వ్యవహారం. ఏ దశలో దీన్ని గుర్తించినా.. కొంత వరకు మాత్రమే దీన్ని నయం చేసే వీలుంటుంది. పూర్తిగా నయం అయినట్లు డాక్టర్లు చెబుతుంటారు. కానీ చాలా మందిలో ఏదో ఒక రోజు అది తిరగబెట్టడం ఖాయమే. అయితే తాజాగా న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో నిర్వహించిన […]

Read More

సింగిల్ గా పోటీ చేయడం, టీడీపీతో వెళ్లడం, టీడీపీ-బీజేపీతో కలసి వెళ్లడం.. ఇలా 2024 ఎన్నికల పోటీపై పవన్ కల్యాణ్ తమకు తామే మూడు ఆప్షన్లు ఇచ్చుకోవడం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీడీపీ, బీజేపీలు ఈ ఆప్షన్లపై పరోక్షంగా సెటైర్లు పేలుస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి, పవన్ పై సెటైర్లు వేశారు. తాను రాజకీయ నాయకుడిని అనే విషయాన్ని పవన్ మరచిపోయారని, ఆయన కేవలం రాజకీయ విశ్లేషకుడిలాగా మాట్లాడుతున్నారని […]

Read More

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో తాము విధించిన జరిమానాను ఏళ్ల తరబడి చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులు 100 శాతం ఎస్టీలకే చెందేలా ఒక జీవోను తీసుకొని వచ్చింది. సదరు జీవోను సవాల్ చేస్తూ కొన్ని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదనలు విన్న తర్వాత ఆ జీవో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పింది. ఉమ్మడి […]

Read More