Author: Sarvi

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు విషయంలో కేంద్ర పెద్దలు వైసీపీకి ఏమాత్రం సహకరించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో బిల్లులకు వైసీపీ ఎగబడి మద్దతు ఇస్తున్నా.. కనీసం వైసీపీ ఆత్మ గౌరవాన్ని కాపాడే అంశాలకూ అటు నుంచి మద్దతు రావడం లేదు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు సాధ్యం కాదని స్పీకర్‌ కార్యాలయ అధికారులు లీకులు వదిలారు. ఢిల్లీలో మీడియా ఇష్టాగోష్టిలో ఈ అంశాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. సొంత పార్టీ ముఖ్యమంత్రి, సొంత పార్టీలోని ఇతర […]

Read More

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. భార‌త్ రాష్ట్రీయ స‌మితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీ పెట్టడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ సాహసాన్ని వామపక్షాలు స్వాగతించాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కేసీఆర్ ఆలోచనను స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌ స్పష్టమైన వైఖరితో ఉండాలని సూచించారు. ఎన్డీఏ వ్యతిరేక కూటమి బలంగా నిలబడాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎత్తుగడ అదిరిపోవాలి.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఎలా అనే […]

Read More

ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు .. ఇప్పటి నుంచే శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముందస్తుగానైనా రావొచ్చు, షెడ్యూల్ ప్రకారమైనా రావొచ్చు అందుకు తగ్గట్టే సిద్ధమ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ పెట్టి 20ఏళ్లు అవుతున్న ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం అనుకున్న స్థాయి ఫలితాలను సాధించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. […]

Read More

నారా అంటే నాసిరకం రాజకీయం, చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ త్వరగా చర్యలు తీసుకోవాలని, సీబీఐ విశ్వసనీయతకే ఈ కేసు పెద్ద సవాల్ అని, సీబీఐ వెనక్కు తగ్గితే ఇక ప్రజల్ని కాపాడేదెవరంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసుల వల్ల కావడంలేదు, సీబీఐ అయినా శాంతి భద్రతలను కాపాడాలని అన్నారు చంద్రబాబు. దీనికి ట్విట్టర్లో కౌంటర్ […]

Read More

“2019 ఎన్నికల్లో నేను ఓ విలన్ తో పోటీ చేసి ఓడిపోయాను.. ఆయన్ను వైసీపీలోకి తెస్తుంటే వద్దని చెప్పా..” గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై, వైసీపీకే చెందిన యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలివి. తనదైన శైలిలో ఈ ఆరోపణలను తిప్పికొట్టారు వంశీ. ‘నన్ను విలన్ అన్నవారు ఏమైనా హీరోలా..? నన్ను విమర్శిస్తున్న మీరు జస్టిస్ చౌదరి కాదు కదా.. నాపై ఆరోపణలు చేసిన ఆయన చంద్రబాబు స్కూల్ స్టూడెంటే కదా..” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే […]

Read More

పర్యాటకశాఖ మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా రోజాతోపాటు ఆమె గన్ మన్ కూడా మహాద్వారం గుండా దర్శనానికి వెళ్లారని కొన్ని చానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ మహాద్వారం గుండా నా గన్ మన్ వెళ్లాడని ఓ టీవీలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇటీవల నేను నియోజకవర్గంలో ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం […]

Read More

చిల్లర రాజకీయాల కోసం దేశప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. కులం, మ‌తం పేరిటి రాజ‌కీయాలు చేస్తూ, ప‌చ్చ‌గా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చ‌లి మంట‌ల‌ను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వాళ్ళ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన‌ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. 11.75 కోట్ల రూపాయలతో ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ […]

Read More

డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వద్ద వాపోయాడు. తనపై ఇంత అపవాదు అవసరమా అని ఆక్రోశించాడట. డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబై లోని ఓ క్రూజ్ షిప్ లో గత ఏడాది అక్టోబరులో ఆర్యన్ ఖాన్ సహా మరికొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు నేపథ్యంలో ఖాన్ సుమారు నెల రోజులపాటు […]

Read More

రాజ్ భవన్ లో రాజకీయాలా అంటూ.. వివిధ పార్టీల నేతలు విమర్శించినా కూడా తెలంగాణ గవర్నర్ తగ్గేదే లేదన్నారు. తొలి విడత మహిళా దర్బార్ ని నిర్వహించారు. మహిళల దగ్గర ఆమె వినతులు స్వీకరించారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అయితే దాదాపుగా అన్నీ వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, ఆస్తి సమస్యలే ఆమె దృష్టికి వచ్చాయి. వాటిని అధికారుల వద్దకు పంపి పరిష్కరించాల్సిందిగా ఆదేశిస్తానన్నారు గవర్నర్. కేసీఆర్ కి మెసేజ్.. సీఎం కేసీఆర్ తో ముఖా […]

Read More

ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డులపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్ అభ్యంతరం తెలిపారు. విజయవాడలో పర్యటించిన ఆమె.. ప్రభుత్వ ఆస్పత్రికి సందర్శించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బోర్డులపై వైఎస్‌ఆర్‌, జగన్‌ ఫోటోలు మాత్రమే ఉండడంతో ప్రధాని మోడీ ఫోటో ఎక్కడని ప్రశ్నించారు. ఆయూష్మాన్‌ భారత్‌కు సంబంధించిన లోగోను గోడపై ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ […]

Read More