Author: Sarvi

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాగోలు పరిధి బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభ నిర్వహించారు. ఆ సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఒక స్కిట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాతా ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు అదే కేసులో బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు […]

Read More

పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఆయన్ను కామెంట్ చేయడం వైసీపీ నేతలకు ఓ సరదా. గతంలో పేర్ని నాని, బొత్స.. పలు సందర్భాల్లో పవన్ ని ఇదే విషయంలో కామెంట్ చేశారు, కార్నర్ చేశారు. ఆ తర్వాత పవన్ నొచ్చుకోవడంతో అలాంటి సెటైర్లు కాస్త తగ్గాయి. తాజాగా మంత్రి గుడివాడ అమర్ నాథ్.. మరోసారి పవన్ పై అలాంటి కామెంట్లు చేశారు. ఆయనకు ఏవైనా మూడు ఉండాలని, అందుకే మూడు ఆప్షన్ లు ఇచ్చారని అన్నారు. […]

Read More

కర్నూలు టు హైదరాబాద్. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ టికెట్ 289 రూపాయలు. ఏసీ బస్సు ఇంద్రలో వెళ్తే 353 రూపాయల టికెట్ తీసుకోవాలి. పొరపాటున ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సీటు దొరక్క, తెలంగాణ బస్సు ఎక్కితే మాత్రం టికెట్ రేటు 445 రూపాయలు. ఏసీ బస్సుకంటే ఎక్కువ రేటు అనమాట. ఈ తేడా తెలిసిన ప్రయాణికులెవరూ తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు సాహసించట్లేదు. రెండు మూడు గంటలు ఆలస్యమైనా.. ఏపీ బస్సు ఎక్కడానికే ఇష్టపడతారు. పోనీ సీటు లేకపోయినా.. […]

Read More

సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. మోసం చేయడంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఇద్దరూ తోడుదొంగలంటూ మండిపడ్డారు. అసలు వారిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇచ్చామని చెప్పారు. పరిహారం అందని ఒక్క కుటుంబాన్నయినా చూపాలంటూ దత్త పుత్రుడికి సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ పరిహారం అందని […]

Read More

జూన్ 12, 2022 ఆదివారం సాయంత్రం బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీ రూ. 24,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే FAB Unit ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది అన్న వార్త సంచలనం సృష్టించింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు అయినప్పుడు, 24,000 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన కచ్చితంగా సెన్సేషనల్ న్యూసే అవుతుంది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్న “Rajesh Exports” ఒక మల్టీనేషనల్ […]

Read More

కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా కింద మీద పడైనా సరే రైతులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు సీఎం వైఎస్ జగన్. రైతుల పంట బీమా పరిహారం 2,977 కోట్ల రూపాయలను సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతుల ఖాతాలోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. అక్కడే బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్.. రైతులకు ఒకవైపు ప్రభుత్వం మంచి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. కోనసీమలో క్రాప్ హాలీడే అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. […]

Read More

శ్రీలంకలో గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో ఇండియా వద్ద సాయం అడిగి చమురు, మెడిసిన్స్, ఇతర నిత్యవసరాలు కొనుగోలు చేస్తోంది. ఇండియా కూడా పక్క దేశానికి ఉదారంగా సాయం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు రోడ్లపైకి ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వాసి చేసిన పనికి అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక నెల […]

Read More

రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యోగాలన్నీ యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ గత వారం ప్రధాని మోడీ కి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ప్రైవేట్ ఉద్యోగాలను ఇస్తామన్న ప్రధాని మోడీ హామీ […]

Read More

ఈ మధ్య బుల్డోజర్ల గురించి దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అనగానే బుల్డోజర్ గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య తెలంగాణలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ లు కూడా డబల్ ఇంజన్ల గురించి, బుల్డోజర్ల గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే గతంలో ఢిల్లీలో, కొంత కాలంగా ఉత్తరప్రదేశ్ లో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యం ప్రజలకు ఏమైనా మేలు చేసిందా ? అసలు ఆ బుల్డోజర్ కు మానవత్వం ఉందా […]

Read More

కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఈడీ, సీబీఐ పేరుతో ఎంతోమందిని కేసుల్లో ఇరికించింది. మాట వినని వారిని దారికి తెచ్చుకోడానికి కేసులు పెట్టించింది, అన్యాయంగా అరెస్ట్ చేయించింది. అయితే ఆ పాపఫలితం ఎక్కడికీ పోలేదు. ఇప్పుడు అదే ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందా? ఈడీని ఉసిగొల్పిందా? అనే విషయాలు పక్కనపెడితే.. ఈడీ కార్యాలయానికి రాహుల్, ప్రియాంక వెళ్లడం మాత్రం కచ్చితంగా కర్మ ఫలితమేనంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ […]

Read More