Author: Sarvi

కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్ పయిరీ డేట్ అయిపోయిన మెడిసిన్ లాంటిదని, దానికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పార్టీ అధినేత రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు విచారణ పేరుతో ఈడీ తీసుకెళ్లినా.. ఆ పార్టీలో ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక పాడెక్కడమే తరువాయి అంటూ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. […]

Read More

అన్నలా ఆదుకుంటాన‌న్న ముఖ్య‌మంత్రి ఇప్పుడు మ‌డ‌మ తిప్పార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆ కేట‌గిరి కింద‌కి వ‌చ్చే మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం షాకిచ్చింది. ఆస‌రా లేని ఒంట‌రి మ‌హిళ‌ల‌కు వైసిపి ప్ర‌భుత్వం నెల‌నెలా పింఛ‌న్ ఇస్తోంది. వివాహం కాని మ‌హిళ‌ల‌కు, భ‌ర్త‌నుంచి విడిపోయి ఒంట‌రిగా జీవిస్తున్న మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2500 పింఛ‌ను ఇస్తుండ‌గా తాజాగా అర్హ‌త నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం..భ‌ర్త‌ను వ‌దిలేసినా లేక భ‌ర్తే వ‌దిలేసినా యేడాది […]

Read More

ఏపీలోని విద్యారంగంపై మొదటి నుంచి తొలి ప్రాధ్యాన్యత ఇస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. తాజాగా బైజూస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ధనిక, మధ్య తరగతే కాకుండా పేదలు కూడా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులు మరింత జ్ఞానం పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఎడ్యూటెక్ సంస్థ ‘బైజూస్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్ కుదుర్చుకున్న ఈ […]

Read More

గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక యువకుడు నాగబాబుకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. యువకుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ పక్కనే ఉన్న సీఐను పిలిచి అతడిపై కేసు నమోదు చేయాలని సూచించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ రూ.1500 కోట్లు అవినీతి చేశారంటూ ఇటీవల టీడీపీ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలంటూ నాగబాబు నిలదీయడంతో వాగ్వాదం మొదలైంది. ” […]

Read More

ఆథునిక సాంకేతిక ప‌రిజ్ణానానికి తెలంగాణ స‌ర్కార్ పెద్దపీట వేస్తోంది. అన్ని విభాగాల్లో సాంకేతిక‌త‌కు ప్రాధాన్య‌మిస్తూ పాల‌నా సౌల‌భ్యాన్ని పెంచుతోంది. తాజాగా ఆర్టీసీ లో కొత్త సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తోంది. ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లందించేందుకు ఈ విధానం ప్ర‌వేశ‌పెట్టామ‌ని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా బస్సుల్లో ఐ-టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ […]

Read More

అది జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా ప్రాంతం. శుక్రవారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. బాగా గమనిస్తే కార్ల అద్దాలు ధ్వంసమవుతున్న సౌండ్ వినిపించింది. అలాగే ఇళ్ల కిటికీలు పగులుతున్న శబ్దం కూడా వినిపించింది. బయటికొచ్చి చూస్తే మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఇలా గుమ్లా ప్రాంతంలోని ప్రతి వీధిలో కార్ల అద్దాలు ధ్వంసం అవుతున్న శబ్దం స్థానికులకు వినిపించింది. అయితే […]

Read More

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిన్న సికిందరాబాద్ లో జరిగిన ప్రదర్శన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ రైల్వే స్టేషన్ పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. వరంగల్ లో కొద్ది సేపటిక్రితం రాకేష్ అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. వందలాది మంది ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆవేశంగా ఉన్న యువకులు నరేంద్ర మోడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాగారు. అంతిమ యాత్ర వరంగల్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే […]

Read More

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. రోజురోజుకీ పెట్రోల్ రేట్లు పెరుగుతున్న కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. పైగా సిటీలో తిరిగే వారికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్రోల్ బైక్స్ తో పోలిస్తే వీటికయ్యే ఖర్చు చాలాతక్కువ. ప్రస్తుతం మార్కెట్లో చాలారకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏథర్ 450 ఎక్స్: ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 116 కి.మీ వరకు వెళ్లొచ్చు. […]

Read More

పీజేఆర్‌ కుమార్తె, టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ విజయారెడ్డి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిచర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. తన తండ్రి సీఎల్‌పీ లీడర్‌గా పనిచేశారని, కాంగ్రెస్‌లో ఉంటూనే మరణించారని, ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సోనియా గాంధీ నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె చెప్పారు. పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో చర్చలు జరిపేందుకు వచ్చానన్నారు. టీఆర్ఎస్‌లో పరిస్థితులు బాగోలేవన్నారు. […]

Read More

దేశంలో కాంగ్రెస్‌ నుంచి అనేక ప్రతి పక్ష పార్టీల వరకు బీజేపీపై పోరాటం విషయం కళ్లు తేలేస్తున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ట్విట్లకే పరిమితం అవుతుండగా.. ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ఎదురెళ్తే ఏమవుతుందోనన్న భయంతో మౌనంగా ఉన్నాయి. దేశంలోనే వివిధ వర్గాలు, సంస్థలు, మేధావులు కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి సరైన మద్దతు లేక మౌనంగా ఉండిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ చేస్తున్న పోరు.. బీజేపీ విధానాలపై పోరాటం చేయాలనుకుంటున్న వారిని […]

Read More