ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్లు పుట్టుకొని వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయగా.. దాని వేరియంట్లు ఇంకా విస్తృతంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చాలా మంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో మరో ప్రమాదకర వైరస్ ఉనికి ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలోప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. రెండు వారాల క్రితం ఇద్దరికి ఈ వైరస్ సోకగా.. వారు […]
Author: Sarvi
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఇవాళ ఉదయం ఒక వ్యక్తి గన్తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. జపాన్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరా నగరానికి వెళ్లారు. అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో వెనుక నుంచి తెత్సూయా యమగమి అనే యువకుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు అబే శరీరంలోకి దూసుకొని పోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రగాయాల పాలైన అబేను స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆసుపత్రికి తీసువచ్చేసరికే అబే నాడి కొట్టుకోవడం లేదని.. ఆర్గాన్స్ […]
జపాన్ మాజీ ప్రధాని షింజే దారుణ హత్యకు గురయ్యారు. నారా సిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వెనుక వైపు నుంచి ఆగంతకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షింజో అబే నారా సిటీలో వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. […]
ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో విజయం వైపు ప్రయాణించి చివరకు ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 సిరీస్ను మాత్రం విజయంతో ప్రారంభించింది. గురువారం రాత్రి సౌంతాంప్టన్లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా బ్యాటుతో, బంతితో రాణించి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న […]
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ప్రసంగం కంటే.. యాదమ్మ వంటలే ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలంటే.. స్టేజ్ పై మాట్లాడే వక్తలు ఎవరెవరు అనే విషయాకలంటే, మధ్యాహ్నం భోజనంలో ఉండే వెరైటీలు ఎన్ని, అవి ఏవి అనే విషయాలే ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీలో కూడా ఫుడ్ మెనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమే ఈ ఫుడ్ మెనూపై ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. […]
రాముడు, హనుమంతుడు అనే కాన్సెప్ట్ సహజంగా బీజేపీ నేతలు ఓన్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ లో కూడా రాముడు, హనుమంతుడు ఉన్నారని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ రాముడైతే.. తాను హనుమంతుడి లాంటివాడినని చెప్పారు. రామాయణంలో రాముడికి హనుమంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. మీరంతా వానర సైన్యం అంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి చెప్పారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు […]
తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఛానెల్స్ అన్నీ.. రెండురోజులుగా చంద్రబాబు ఉంగరం గురించి కథనాలు వండి వార్చాయి. చంద్రబాబు కొత్త ఉంగరం పెట్టుకున్నారు, అది హైటెక్ ఉంగరం, దానిలో ఉన్న సుగుణాలు చూడండి అంటూ ఊదరగొట్టాయి. అసలు చంద్రబాబు ఏ ఉంగరం పెట్టుకుంటే జనాలకి ఉపయోగం ఏంటి..? ఆయన ఉంగరం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి..? ఇక్కడ మీడియాని తప్పుబట్టలేం, బాబు ప్రమోషన్ మైండ్ గేమ్ ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈమధ్య కాలంలో చంద్రబాబు వార్తలంటే ఆ మూడు […]
మహానాడు ఘనంగా జరిగింది, మినీ మహానాడులు అంతకంటే బాగా జరుగుతున్నాయని చెబుతున్నారు చంద్రబాబు. కానీ కొన్నిచోట్ల మాత్రం ఆయనకు తలనొప్పులు తప్పడంలేదు. అసలే నాయకులు లేరు, 2024లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బాబు బాధపడుతుంటే.. ఉన్న నాయకుల్లో కూడా సఖ్యత లేకపోవడం మరో విశేషం. తాజాగా అన్నమయ్య జిల్లా కలికిరిలోని పుంగనూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. అధినేత చంద్రబాబు ముందే తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట మొదలు పెట్టారు. మాది క్రమశిక్షణ […]
హైదరాబాద్ శివారులోని ఒక తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి మఫ్టీలో వెళ్లిన పటాన్చెరు పోలీసులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని కూడా వీడియో తీశారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని చింతమనేని సహా పలువురు వీఐపీలు పారిపోయారు. 49 మంది పందెంరాయుళ్లతో పాటు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టారు. తాను […]
ఏపీలో విలీనం పేరుతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని వివరించారాయన. ఏపీలో బడులు మాయం అంటూ ఓ వర్గం మీడియా కట్టుకథలు అల్లుతోందన్నారు బొత్స. మాయమైపోడానికి బడులేమైనా ఎడ్ల బండ్లా, తోపుడు బండ్లా..? అంటూ ఆగ్రహం […]