సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన ట్వీట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ వ్యవహారంపై వర్మకు నోటీసులు జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు. సినిమా రంగానికి చెందిన ఆయన.. బాధ్యతాయుతంగా ఉండాలని, ఆయన చేసే కామెంట్స్ సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని చెప్పారామె..? […]
Author: Sarvi
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆయన పాలనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ. గత ఎన్నికల్లో ప్రజలంతా భారీగా ఓట్లేసి వైసీపీని గెలిపించినా.. టీడీపీకి మాత్రం సిగ్గుమాత్రం రావడం లేదు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించి జనరంజక పాలన అందిస్తున్న జగన్పై ప్రతినిత్యం తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా బురద చల్లిస్తుంటారు. ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే నిత్యం ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ పబ్బం […]
హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్గా డిజిటల్ పద్దతిలో సొమ్ము చెల్లించడానికి ‘ఫాస్టాగ్’ (FAStag) అనే పద్దతిని తీసుకొని వచ్చారు. టోల్ ప్లాజా దగ్గరకు మన వాహనం వెళ్లగానే విండ్ షీల్డ్పై ఉండే ఫాస్టాగ్ ద్వారా మన బ్యాంకు ఖాతా నుంచి మనీ కట్ అయిపోయి, ఎదురుగా ఉండే గేట్లు తెరుచుకుంటాయి. చిల్లర కోసం వెతుక్కోవడం, భారీ క్యూలు ఉండక పోవడంతో ప్రయాణం సులువుగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పడు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో అందరూ […]
ఏపీలో మద్యంపై మరోసారి టీడీపీ పాత ఆరోపణలతోనే దాడికి దిగింది. ఆంధ్రా గోల్డ్ విస్కీ, 9సీ హార్స్ విస్కీలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని.. వీటి వల్ల సూదులతో గుచ్చినట్టు అనిపించడం, అయోమయంగా అనిపించడం, కళ్లు ఎరుపెక్కడం, మానసిక సమస్యలు రావడం జరుగుతుందని టీడీపీ నేతలు ఆనం వెంకటరమణారెడ్డి, అనురాధ ఆరోపించారు. గతంలో శాంపిల్స్ ఎక్కడివి అని ప్రభుత్వం ప్రశ్నించిందని.. అందుకే ఇప్పుడు తాము ఏయే మద్యం షాపుల నుంచి శాంపిల్స్ సేకరించామన్న దానిపై వివరాలను కూడా టీడీపీ […]
అమెరికాలో తరచూ జరిగే విచ్చలవిడి కాల్పుల నేపథ్యంలో అక్కడి గన్ కల్చర్పై కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ ప్రత్యేకమైన బిల్లును ఆమోదానికి వచ్చింది. ఈ బిల్లులో ఏముందంటే.. అమెరికన్లు ఎదురు చూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ఆమోదం పొందనుంది. ఎప్పటినుంచో నానుతూ వస్తున్న ఈ బిల్లు గొడవ గురువారం ఒక కొలిక్కి వచ్చింది. గురువారం 15 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు సమ్మతించడంతో […]
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ప్రతీ ఏడాది ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలిచ్చింది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థిర, చర ఆస్తులు కొన్నా, అమ్మినా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీచర్లు తమ సొంత, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భవనాలు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాల వివరాలను వాటి మార్కెట్ ధర ప్రకారం వివరించాలని వివరించారు. స్థిరచరాస్తుల వివరాలను ప్రైమరీ టీచర్లు స్కూల్ […]
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిపథ్ అల్లర్ల కారణంగా జరిగిన ఆస్తి నష్టం అక్షరాలా 12కోట్ల రూపాయలు. రైల్వే బోగీలు తగలబెట్టడం, ఇతరత్రా ఆస్తుల ధ్వంసం కారణంగా రైల్వేకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి కారణం.. అగ్నిపథ్ పథకం అమలులోకి వస్తే.. డిఫెన్స్ కోచింగ్ అకాడమీలకు ప్రాధాన్యం ఉండబోదనే ఒకే ఒక్క కారణం. ఆ కారణంతోనే సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు ఈ పని చేయించాడు. తన అనుచరులు మల్లారెడ్డి, బీసీ రెడ్డి, శివతో కలిపి […]
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ పూర్తిచేసుకొని, డిపార్ట్మెంటల్ పరీక్ష కూడా పాస్ అయిన వారికి ఈ జీవో ప్రకారం జీతాలు అందనున్నాయి. జీవో నెంబర్ 5 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఈ జీవోకు సంబంధించిన ఉత్తర్వుల జారీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా రోజుల […]
ఎక్కడైనా ఆందోళనలు, ఉద్రిక్తతలు జరుగుతున్నాయంటే తక్షణమే ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ప్రభుత్వాలకు పరిపాటి. సంఘ విద్రోహక శక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అరాచకాలకు పాల్పడతాయంటూ చెబుతుంటాయి. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సామాన్య ప్రజానీకానికి తీవ్రనష్టం జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఇదే విషయమై ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకించింది. ఇటువంటి షట్ డౌన్ చర్యలకు పాల్పడవద్దంటూ ప్రపంచ దేశాలను కోరింది. ఏవో కారణాలు […]
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగుతాయనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ పై ఫోకస్ పెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేలందర్నీ కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ సాధించాలని, అందుకు అంతా గట్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గట్టిగా కృషి చేస్తే అదేమంత కష్టం కాదని కూడా వారిని ప్రోత్సహించారు. ఈ టార్గెట్ సాధించేందుకు వీలుగానే ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని కూడా వినిపిస్తోంది. ఎన్నికల సంసిద్ధతలో భాగంగా ఎన్నికల […]