Author: Sarvi

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును జోడించడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్ల సమయంతో తమ ఇళ్లను తగలబెట్టడంపై మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌లు ఆవేదన చెందారు. వైసీపీ అమలాపురం ప్లీనరిలో నేతలిద్దరూ మాట్లాడారు. తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూసిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగడం సరికాదనిపించిందని.. ఆ విషయాన్ని సీఎం జగన్‌ను కలిసి తెలియజేశానని ఎమ్మెల్యే పొన్నాడ వివరించారు. కానీ సీఎం జగన్ ధైర్యం చెప్పారని.. ఆయనిచ్చిన ధైర్యంతోనే తిరిగి వచ్చానన్నారు. తనతోపాటు, […]

Read More

2024 ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆ మధ్య మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. జనసేనకు ఈసారి అధికారం ఇవ్వండి, మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పవన్ పదే పదే తన ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. కనీసం బీజేపీ ప్రస్తావన కూడా ఆయన తేవడంలేదు. ఇప్పుడు బీజేపీ కూడా అదే రూట్లో ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనంటున్నారు […]

Read More

రండి.. ఇప్పుడే తేల్చుకుందామంటూ టీడీపీ, బీజేపీ నేతలకు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఎమ్మెల్యే.. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ”అధికారంలోకి వస్తే అక్రమాలను తేలుస్తా అంటున్నావ్.. ఎప్పుడు వస్తావ్, రంగంలోకి ఎప్పుడు దిగుతావో చెప్పు.. కాళ్లు చేతులు విరుస్తామని […]

Read More

గుండె వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవటం, వ్యాయామం లేకపోవటం, మానసిక ఒత్తిడి. అయితే ఇవే కాకుండా మనం ఊహించలేని కారణాలు మరికొన్ని గుండె జబ్బులను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అలాంటివాటిలో నోరు, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా ఒకటి. నోరు శుభ్రంగా లేకపోతే చిగుళ్ల నుంచి రక్తంలోకి చేరిన బ్యాక్టీరియా రక్తనాళాలను అనారోగ్యానికి గురిచేస్తాయి. అలాగే దీనివలన ఇతర గుండె సమస్యలు సైతం రావచ్చు. కనుక దంతాలు చిగుళ్లకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే […]

Read More

యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఆడవాళ్ల ఆరోగ్యానికి సంబంధించి ఓ వాట్సాప్ సర్వీస్.. రీసెంట్‌గా అమలులోకి వచ్చింది. ఒక ప్రముఖ సంస్థతో కలిసి వాట్సాప్ ఈ సేవలను మొదలుపెట్టింది. అవేంటంటే.. మహిళలు తమ నెలసరి సైకిల్‌ని ట్రాక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఓ కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా ఉన్న వాట్సాప్ తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్నిరకాల సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. […]

Read More

తెలంగాణకు కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చిందా? తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎక్కువ నిధులు వెళ్లాయా..? అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చినట్టు నిరూపించగలిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్తానంటూ ఛాలెంజ్ చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాల్ విసిరారు. రాష్ట్రపతి అభ్యర్థి సొంత […]

Read More

”టీఆర్‌ఎస్‌ లో సీఎం పదవికోసం పార్టీ చీలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. తన కొడుకు కేటీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒక నెల అయినా సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కొడుకు కనీసం మాజీ సీఎం అని అయినా అనిపించుకోవాలని అనుకుంటున్నారు.కూతురు కవిత,మేనల్లుడు హరీశ్‌రావు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.టిఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి’’అని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. టిఆర్ఎస్ లో చీలిక రావాలని కేసీఆర్ ప్రత్యర్థులు చాలాకాలంగా కాంక్షిస్తున్నారు.ఇంగ్లీష్ లో దీన్ని ‘wishful thinking’ అంటారు.అయితే […]

Read More

ఖైరతాబాద్ అనగానే అందరికీ భారీ వినాయకుడి విగ్రహమే గుర్తుకువస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా పేరు ఉంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్‌కు భక్తులు పోటెత్తుతారు. 68 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినాయక విగ్రహాం ప్రతీ ఏడాది ఒక అడుగు పెంచుతూ పోవడంతో 2014లో 60 అడుగులకు చేరుకుంది. మొదట్లో మట్టితోనే చేసినా.. కాలక్రమంలో భారీ విగ్రహా నిర్మాణంలో భారీగా స్టీల్, ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌ను ఉపయోగిస్తూ వచ్చారు. కాగా, పర్యవరణ కార్యకర్తలు, […]

Read More

హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌కు తోడు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చినా.. స్వంత వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా జంట నగరాల్లోని కీలకమైన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం-జీహెచ్ఎంసీతో కలిసి కేంద్ర ప్రభుత్వం అందించే కొంత సాయంతో ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. కాగా, సికింద్రాబాద్ ప్రాంతంలోని కంటోన్మెంట్ వల్ల అక్కడ ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం కష్టంగా మారింది. సికింద్రాబాద్ […]

Read More

ప్రతి ఒక్కరికి చదువే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ పేద విద్యార్థి కూడా విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతో అమ్మఒడి స్కీంను తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 80 లక్షల మంది విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. అమ్మఒడి లబ్ధిదారులకు బటన్ నొక్కి నగదు జమ చేశారు. అనంతరం […]

Read More