Author: Sarvi

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జ‌ర‌గ‌నున్న బహిరంగ సభలో మోడీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరనుండటం దాదాపు ఖాయమైంది. తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికలకు సమాయాత్త పరిచేందుకు గాను విజయ్ సంకల్ప్ పేరుతో ఈ సభ నిర్వహిస్తోంది. కాగా, సభకు ప్రధాని మోడీ హాజరవుతుండటంతో ఇతర పార్టీలో నుంచి భారీగా ముఖ్య నేతలను తీసుకొని వచ్చి చేర్పించాలని బీజేపీ భావించింది. […]

Read More

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము విజయం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాళ్లు విసిరారు. తాజాగా ఆయన ట్విట్టర్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ ని చేస్తారు మోదీజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేటీఆర్. సూటిగా, సుత్తి […]

Read More

ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో 5గురు కూలీల సజీవ దహనం సంఘటనకు ఉడుతే కారణమని తేల్చేరు అధికారులు. వ్యవసాయ కూలీ పనుల కోసం తాడిమర్రి మండలం గుడ్డంపల్లి నుంచి చిల్లకొండయ్యపల్లి కి ఆటో ట్రాలీలో వెళ్తున్న కూలీలపై విద్తుత్తు హైటెన్షన్ తీగలు పడి మంటలు అంటుకొని 5గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన విద్యుత్ అధికారులు ఆ ప్రమాదానికి ఉడుతే కారణమని తేల్చారు. ఉడుత షాట్ అయినప్పుడు లైన్ కట్ […]

Read More

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం సందర్భంగా ఆ పోరు పీక్ కు చేరిందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య కొద్ది రోజులుగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామని అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై ఒకరిపై ఒకరు ఎత్తులు పై […]

Read More

టీడీపీ నేత వంగలపూడి అనితపై.. వైసీపీ మహిళా విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ అనితకు ఈ స్థాయిలో కౌంటర్లు పడలేదు. ఒకరకంగా వైసీపీ మహిళా విభాగం కూడా కాస్త స్తబ్దుగా ఉందనే చెప్పాలి. కానీ ఇప్పుడు వారు కూడా రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. అనితకు ఫుల్ డోస్ ఇచ్చేశారు. దళిత ద్రోహి అనితకు.. టీడీపీలో యామిని, దివ్యవాణికి పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు. చింతకాయల చింతామణి.. అనిత మీడియా ముందుకొచ్చి నీతులు […]

Read More

ఏపీలో కల్తీ మద్యం అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. టీడీపీ ఒక కల్తీ పార్టీ అని, కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఆయన ఓ కల్తీ నాయుడు, కల్తీ నాయకుడని సెటైర్లు వేశారు నాని. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని విమర్శించారు. విషం ఎక్కడో లేదని, చంద్రబాబు బుర్రలోనే విషం ఉందన్నారు నాని. మీరు తాగి పంపించారా..? గోబెల్స్‌ ప్రచారానికి తాత చంద్రబాబేనంటూ ధ్వజమెత్తిన […]

Read More

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారన్న కేసుల్లో రఘురామకృష్ణంరాజును విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేశద్రోహం సెక్షన్‌ మినహా ఇతర సెక్షన్ల కింద దర్యాప్తునకు సహకరించాల్సిందేనని రఘురామకృష్ణంరాజును కోర్టు ఆదేశించింది. ఏపీకి వెళ్తే సీఐడీ అధికారులు తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ వేదికపై హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో విచారించాలని రఘురామ తరపు న్యాయవాది కోరగా.. సీఐడీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో […]

Read More

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం షాకిచ్చింది. ఈనెల 26న వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి. అయితే ఆ చేరిక చెల్లదని, వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్. అధిష్టానానికి తెలియకుండా, కనీసం టీపీసీసీ చీఫ్ కి సరైన సమాచారం ఇవ్వకుండా కండువా కప్పేసినందుకు కోమటిరెడ్డిపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. త్వరలో దీనిపై […]

Read More

ప్రధాని మోదీ కరీంనగర్ యాదమ్మ చేతి వంట తినబోతున్నారు. జూలై 2 నుంచి హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొనే అతిథులకు తెలంగాణ వంటలను రుచి చూపించాలని బండి సంజయ్ నిర్ణయించారు. అందుకోసం యాదమ్మను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రప్పించారు. తెలంగాణ వంటలు వండాలంటే అందరికీ యాదమ్మనే గుర్తొస్తుందని ప్రతీతి. ఎక్కడ పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరిగినా వంటల కోసం యాదమ్మనే పిలుస్తారు. మం త్రులు కేటీఆర్ తో సహా అనేక […]

Read More

దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పెద్దల విధానాలు మారకుంటే వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ప్లీనరీలో మాట్లాడిన వేణుగోపాల్.. కార్యకర్తలు కూడా బయటకు రావడం లేదన్నారు. కార్యకర్తలకు రావాల్సిన బిల్లులే ఇప్పించలేదు.. మళ్లీ మీరు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే వాపోయారు. తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల పనులు కేటాయించారని.. తాను అత్యుత్సాహంతో పార్టీ […]

Read More