Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    21న జాలాది రత్నసుధీర్‌ కథా సంపుటి ఆవిష్కరణ

    By Telugu GlobalJuly 19, 20232 Mins Read
    21న జాలాది రత్నసుధీర్‌ కథా సంపుటి ఆవిష్కరణ
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మనసే కోవెలగా మమతలు మల్లెలుగా… అనే పాట విన్నాము, అలాగే మనసు గతి ఇంతే, మనిషి బతుకు ఇంతే అనే నిట్టూర్పుని విన్నాము. మనసుని కేంద్రంగా చేసుకొని వచ్చిన సినిమా పాటలు అనేకం. అయితే మనసును, మానవ మనస్తత్వాన్ని కేంద్రంగా చేసుకొని జాలాది రత్నసుధీర్‌ కొన్నాళ్ళుగా కథలు రాస్తున్నారు. వారి కొత్త కథల సంపుటి ‘మనసు పలికిన…’ ఆవిష్కరణ సభ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది.

    పదిహేను కథల సమాహారం ‘మనసు పలికిన…’. ఈ పుస్తకానికి విహారి ముందుమాట రాస్తూ వ్యక్తి వికాసానికి ఈ కథలు తోడ్పడతాయని చెప్పిన మాట అక్షర సత్యం. మానవ సంబంధాలను, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను, పిల్లల పెంపకంలో మనస్తత్వ పరిశీలన ప్రాముఖ్యతను ఈ కథలు వివరిస్తాయి. రత్నసుధీర్‌ ఇదివరలో ‘మనసు కథలు’ పేరుతో ఒక సంపుటి వెలువరించారు. మనసును కేంద్రంగా చేసుకొని రాసిన రెండో కథల సంపుటి ఇది. మనిషి మనసు ఎంత చిత్రమైనదో, ఎన్ని హోయలు పోతున్నదో కథల ద్వారా చెప్పడం విశేషం. ‘గుప్పెడుమనసు’ ఎన్నిరకాలుగా భావోద్వేగాలకు లోను చేస్తుందో చెప్పిన తీరు ఆసక్తికరం.

    కథకునిగా ప్రసిద్ధి చెందిన జాలాది రత్న సుధీర్‌ కవి, గేయకర్త, నాటకకర్త, వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత. కవిత్వం రాశారు. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వారి ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకం. కథా రచయితగా సమాజ గమనాన్ని, మనుషుల్లోని వైరుధ్యాలను చిత్రించారు. రాయకుండా ఉండలేనప్పుడు కవితలు రాశారు.

    మరీ ముఖ్యంగా అమ్మను కేంద్రంగా చేసుకొని ‘అమ్మ చెక్కిన శిల్పం’ పేరుతో ఒక వ్యాసాల పుస్తకం వెలువరించారు. ఇది వారి నుంచి వెలువడిన గొప్ప కంట్రిబ్యూషన్‌. విభిన్న రంగాలలో ప్రఖ్యాతి చెందిన వారి జీవితంలో వారి మాతృమూర్తులు పోషించిన పాత్రని ఒక్కొక్క వ్యాసంలో వివరించారు. భిన్న రంగాలకు చెందిన 26 మంది ప్రముఖుల జీవితంలో వారి తల్లుల పాత్రని చెప్పడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఈ పుస్తకం చదివితే తమ తల్లి గురించి కూడా ఇలా చెప్పాలన్న ఉత్సాహం కలుగుతుంది ఎవరికయినా.

    ఇప్పటివరకు రత్న సుధీర్‌ వెలువరించిన పుస్తకాలు.

    1. మనసు కథలు

    2. మనసు పలికిన…

    3. అమ్మ చెక్కిన శిల్పం

    4. గెలవాలంటే… (విజయవానికి ఏడు సూత్రాలు)

    5. ప్రక్షాళన (కవిత్వం)

    6. స్పర్శ (కవిత్వం)

    తెలుగులోనే కాదు ఇంగ్లీషులోనూ రాయగలిగిన ప్రతిభావంతులు రత్నసుధీర్‌. అమ్మ చెక్కిన శిల్పం, గెలవాలంటే పుస్తకాలను తనే ఆంగ్లంలోకి అనువదించి, పుస్తకాలుగా వెలువరించారు. రెండు భాషల్లోనూ మంచి పట్టు ఉన్న సృజనశీలి రత్నసుధీర్‌. నిరంతర అధ్యయనం, రచనా వ్యాసంగం ఆయన బతుకుయానంలో అంతర్భాగం. వారి పుస్తకం ‘మనసు పలికిన…’ ఆవిష్కరణ సభకు ఇదే ఆహ్వానం. ప్రముఖ రచయిత సి.ఎస్‌. రాంబాబు అధ్యక్షతన జరిగే ఈ సభలో పుస్తకాన్ని ఆచార్య కొలుకలూరి ఇనాక్‌ ఆవిష్కరిస్తారు. సభలో ఇంకా విహారి, ఎ. దినకరబాబు, గుడిపాటి ప్రసంగిస్తారు.

    Jaladi Ratna Sudheer Sahitya Varthalu
    Previous Articleబరువు తగ్గడం కోసం చాట్‌జీపీటీ చెప్పిన డైట్ ప్లాన్!
    Next Article Realme C53 | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో రియల్‌ మీ బ‌డ్జెట్ ఫోన్‌.. ఇవీ డిటైల్స్‌..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.