Telugu Global
Andhra Pradesh

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు : శ్యామల

సీఎం చంద్రబాబు పాలనలో మహిళలపై విపరీతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు : శ్యామల
X

ఏపీలో మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమయిందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శించారు. సీఎం చంద్రబాబు పాలనలో మహిళలపై విపరీతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు స్పందించలేదని అడిగారు. ఒక మహిళగా, ఒక తల్లిగా హోం మంత్రి అనిత కూడా సరైన విధంగా స్పందించడం లేదని దుయ్యబట్టారు.. టీడీపీ నేత ఖాదర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగితే హైకోర్టు రూ. ఐదు లక్షలు పరిహారం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. రిషితేశ్వరి ఘటనలో దోషిగా ప్రిన్సిపాల్‌పై కేసు కూడా పెట్టలేదు. వైస్సార్‌సీపీ నేతలు ధర్నాలు చేస్తేగానీ అరెస్టు చేయలేదు. వనజాక్షి విషయంలో కూడా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు

వైఎస్సార్‌సీపీ హయాంలో దిశ యాప్‌ తీసుకొచ్చాం. దిశ యాప్‌ ద్వారా ఎందరో మహిళలకు న్యాయం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ చట్టంపరై బురదజల్లారు. దిశా యాప్ ద్వారా 13,600 మంది రక్షణ పొందారు. అలాంటి గొప్ప యాప్‌ని చంద్రబాబు తొలగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆరుగురిని హత్య చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ విజృంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పిల్లలకు మంచి చదువులు దూరం అయ్యాయి. మంచి తిండి దూరం అయింది. చివరికి మంచినీరు కూడా దొరకక డయేరియా వ్యాపించే పరిస్థితి తెచ్చారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం’’ అని అన్నారు.

First Published:  22 Oct 2024 10:05 AM GMT
Next Story