విద్యా సమస్యలపై వైసీపీ ధర్నా వాయిదా
వైఎస్సార్సీపీ ధర్నాలో మార్పు జరిగింది.
BY Vamshi Kotas28 Dec 2024 8:38 PM IST

X
Vamshi Kotas Updated On: 28 Dec 2024 8:38 PM IST
ఏపీలో విద్యార్థులకు బాసటగా ఫీజు రీయింబర్స్మెంట్పై జనవరి 3న వైసీపీ తలపెట్టిన ఆందోళనన కార్యక్రమాన్ని జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. అయితే, 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Next Story