ఏపీలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ్య సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ్య సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని ఈసీ రిలీజ్ చేసింది. ఒడిశా, బెంగాల్, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉపసంహరణ , డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మూడు నెలల అనంతరం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య , బీద మస్తాన్రావు విడుదల వారీగా పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వెంకటరమణ, బీద మస్తాన్రావు టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా ఆర్ కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు.