Telugu Global
Andhra Pradesh

11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

శ్రీవారి లడ్డూ కల్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయున్నట్లు తెలిపారు.

11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష
X

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరూలోని దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దీక్ష చేపట్టి, 11 రోజులపాటు కొనసాగించనున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పందించారు. తాను ఏ పని చేసినా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్నాకే పని మొదలు పెడతానని సీఎం చెప్పారు. తమ ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని అన్నారు. తన చిన్నతనంలో తన ఇంటి దగ్గర నుంచి చూస్తే తిరుమల కొండ కనిపించేదని చెప్పారు."ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడు నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో..మనం నిమిత్త మాత్రులం..దేవుడే అన్నీ చేయిస్తాడు.. ఇదీ అంతే అనుకుంటున్నా" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

First Published:  21 Sept 2024 3:17 PM GMT
Next Story