Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    కపట నాటకాలకు కాలం చెల్లింది.. నారా లోకేష్ ఘాటు ట్వీట్

    By Telugu GlobalJuly 18, 20242 Mins Read
    కపట నాటకాలకు కాలం చెల్లింది.. నారా లోకేష్ ఘాటు ట్వీట్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఎక్కడ ఏ విధ్వంసం జరిగినా ప్రతిపక్షం ఆవేదన వ్యక్తం చేసింది కానీ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. వినుకొండ ఘటన మాత్రం అందుకు విరుద్ధం. నడిరోడ్డుపై జరిగిన హత్య ఇది. రాజకీయ కారణాలను పక్కనపెడితే.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్య ఇటీవల కాలంలో ఇదే మొదటిది. ఇలాంటి దారుణాన్ని ఎవరూ సమర్థించరు, సహించరు. అయితే ఇక్కడ కూడా రాజకీయ కక్షలు వెలుగులోకి రావడం విశేషం. వైసీపీ, టీడీపీ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నేరుగా ఇక్కడ జగన్ రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఆయన ట్వీట్ వేశారు. ఇటు ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ఆయనకు బదులిచ్చారు. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్, ఫేక్ ప్రచారాలపై, అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని మండిపడ్డారు.

    హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి…

    — Lokesh Nara (@naralokesh) July 18, 2024

    హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తోందంటూ ఘాటు ట్వీట్ వేశారు మంత్రి నారా లోకేష్. బాధితులనే నిందితులు చేసి, గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూటమి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకిలించి వేస్తుందని చెప్పారు. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదని బదులిచ్చారు. జగన్ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం తమది కాదని, ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదని చెప్పారు లోకేష్.

    కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై అఘాయిత్యాలతోపాటు.. చాలా చోట్ల దాడులు పెచ్చుమీరాయి. గతంలో కూడా నేరాలు ఇలానే ఉన్నాయని, కావాలని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారని, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని టీడీపీ కవర్ చేస్తూ వచ్చింది. కానీ నడిరోడ్డుపై జరిగిన హత్య ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. దీంతో నారా లోకేష్ ఇలా ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.

    lokesh tweet Nara lokesh
    Previous Articleరాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకు జగన్‌ వార్నింగ్‌
    Next Article ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదు.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.