జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి అరెస్ట్
జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి లక్ష్మి అరెస్ట్ అయ్యారు.
![జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి అరెస్ట్ జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి అరెస్ట్](https://www.teluguglobal.com/h-upload/2025/02/10/1402095-laxmi.webp)
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి అరెస్ట్ అయ్యారు. పాత చెక్ బౌన్స్ కేసులో లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలని గత కొద్దిరోజులుగా బాధితురాలు లక్ష్మి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో ఇవాళ లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్ఘతం చేశారు. అయితే, ప్రెస్మీట్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
చెక్బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కాగా, కిరణ్ రాయల్ కోసం కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో కిరణ్ రాయల్ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని లక్ష్మి ఫిర్యాదు చేయగానే, ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు తెరపైకి చెక్ బౌన్స్ కేసు రావడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.