Telugu Global
Andhra Pradesh

జగన్ తిరుమల పర్యటన రద్దు..ఎందుకంటే?

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది

జగన్ తిరుమల పర్యటన రద్దు..ఎందుకంటే?
X

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దయ్యింది. వైసీపీ నేతలను ముందుస్తు నోటీసులు, తిరుపతి జిల్లావ్యాప్తంగా ఆంక్షలు, డిక్లరేషన్ అంశంతో టీటీడీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా...? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో, జగన్ తిరుమల పర్యటనక్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని అధినేత భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని టీడీపీ,బీజేపీ పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి. కాసేపట్లో జగన్ మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్‌పై భౌతిక దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు.

First Published:  27 Sept 2024 9:45 AM GMT
Next Story