యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం అద్భుతం : హీరో సుమన్

యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్రలో మాజీ సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. ఇవాళ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
Update:2024-10-17 14:38 IST

యాదగిరిగుట్టలక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ నటుడు సుమన్ ఇవాళ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం సుమన్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలను అందించారు. ఈ సందర్బంగా సుమన్ మాట్లాడుతూ..తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. గుడిలోపటలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఎంతో మంది శిల్పులు పనిచేసి అద్భుత శిల్పాలను, గోపురాలను చెక్కారని, గుడిలోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు.

ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, భవిష్యత్తులో యాదగిరిగుట్ట ఆలయం దేశ, విదేశాల్లో మరింత ఖ్యాతిని పొందుతుందని తెలిపారు సుమన్. కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆలయాన్ని చాలా అందంగా అద్భుత శిల్పకళతో నిర్మింప చేశారని సుమన్ తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఆలయ పరిశుభ్రతను ఆయన మెచ్చుకున్నారు. పారిశుద్ధ్యంపై భక్తులు సైతం సహకరించాలని సుమ‌న్ కోరారు.

Tags:    
Advertisement

Similar News