గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

గ్రూప్‌-2 పరీక్షలు నిజానికి ఆగస్టు 7, 8వ తేదీల్లోనే జరగాలి. కానీ, డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షల మధ్య వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది

Advertisement
Update:2024-08-22 20:01 IST

తెలంగాణలో గ్రూప్‌- 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసింది TGPSC. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వ‌హిస్తారు. పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌ & జనరల్‌ ఎబిలిటీస్‌) పరీక్ష డిసెంబర్ 15వ తేదీ మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్‌-2 (హిస్టరీ, పాలిటీ, సొసైటీ) పరీక్ష రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. పేపర్‌-3 (ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌) పరీక్ష 16వ తేదీ మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. పేపర్‌-4 (తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర అవతరణ) రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.



గ్రూప్‌-2 పరీక్షలు నిజానికి ఆగస్టు 7, 8వ తేదీల్లోనే జరగాలి. కానీ, డీఎస్సీ, గ్రూప్‌-2 పరీక్షల మధ్య వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వారి డిమాండ్‌కు తలొగ్గిన రేవంత్ సర్కార్‌ గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేసింది. తాజాగా ఇప్పుడు పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్‌-2 పరీక్ష జరగనుంది.

Tags:    
Advertisement

Similar News