ఆ కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే పేలుతుంది

మేం సియోల్‌ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే టపాసులా పేలుతుందన్న మంత్రి పొంగులేటి

Advertisement
Update:2024-10-24 13:52 IST

గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పట్లో ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంది. మేం సియోల్‌ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే పేలుతుంది. అరెస్ట్‌ చేయాలా.. జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుంది. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుంది. అది మా నిర్ణయం కాదన్నారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారు. వారంతా ఫలితాలు అనుభవిస్తారని పొంగులేటి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News