మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి కింద స్వర్గస్తులయ్యారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్‌ సంతాపం.

Advertisement
Update:2024-09-29 11:56 IST

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి కింద స్వర్గస్తులయ్యారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్‌ సంతాపం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు.

ప్రముఖుల సంతాపం

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పుమరణం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి కుందూరు జానా రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రిపొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్, అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు  కొండా సురేఖ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News