మహా కుంభమేళాలో కుటుంబ సమేతంగా నారా లోకేష్

ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు.

Advertisement
Update:2025-02-17 15:02 IST

ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఇవాళ తెల్లవారుజామున నారా భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్‌‌తో కలిసి త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఆ తర్వాత వార‌ణాసి కాల‌భైర‌వ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ వద్ద తీసుకున్నసెల్పీని ట్వీట్ చేసి నిజంగా ఆశ్వీదించబడ్డాం అని లోకేశ్ సెల్పీని ట్వీట్ చేశారు.

అలాగే సాయంత్రం 3.40 గంట‌ల‌కు వార‌ణాసికి కాశీ విశ్వేశ్వ‌ర ఆల‌యాన్ని సంద‌ర్శించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత సాయంత్రం 4 గంట‌ల‌కు విశాలాక్షి దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఈ ఆల‌యం సంద‌ర్శ‌న అనంత‌రం సాయంత్రం 5.25 గంట‌ల‌కు వార‌ణాసి నుంచి విజ‌య‌వాడ‌కు తిరుగు ప‌య‌ణమ‌వుతారు. కాగా, ప్ర‌యాగ్‌రాజ్ లో గ‌త నెల 13 నుంచి ప్రారంభ‌మైన మ‌హాకుంభ‌మేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాదిగా భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఈనెల 26 వ‌ర‌కు కుంభ‌మేళా జ‌ర‌గ‌నుంది.

Tags:    
Advertisement

Similar News