జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న క్రికెటర్లు తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్

దసరా పండుగ రోజున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా తెలుగు ప్లేయ‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్ కుమార్ రెడ్డి ద‌ర్శించుకున్నారు.

Advertisement
Update:2024-10-12 14:27 IST

విజయ దశమి రోజున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా తెలుగు ప్లేయ‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్ కుమార్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. శనివారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు హైదరాబాద్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు ఉప్ప‌ల్ స్టేడియంలో భారత్, బంగ్లా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్ప‌టికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవ‌సం చేసుకుంది. చివ‌రి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త జ‌ట్టు చూస్తోంది. మ‌రోవైపు బంగ్లా టైగ‌ర్స్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని భావిస్తోంది.

మూడో టీ20లో మరో యువ పేసర్ హర్షిత్ రాణా ఎంట్రీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి రెండు టీ20ల్లో మయాంక్‌ను తీసుకోవడంతో రాణాకు చోటు దక్కలేదు. దీంతో మూడో టీ20లో మయాంక్‌ను పక్కనపెట్టి అతన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ చక్రవర్తికితోడుగా రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. రియాన్ పరాగ్‌‌ స్థానంతో అతన్ని తీసుకునే తీసుకోనే అవకాశం ఉంది. 

Tags:    
Advertisement

Similar News