నలుగురు వ్యోమగాములకు సునీత, విల్మోర్ స్వాగతం..వీడియో ఇదిగో
అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.;
ముడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్ను భుమ్మిదకు తీసుకురావడానికి నాసా-స్పేస్ ఎక్స్ రాకెట్ అంతార్జాతీయ కేంద్రం వద్దకు చేరుకుంది. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్థానంలో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అక్కడ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో ఆన్ మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్లు కలిశారు. సునీత, విల్మోర్లు వారికి స్వాగతం పలికారు.
దీనికి సంబంధించిన వీడియోను నాసా విడుదల చేసింది. సునీత, బుచ్ విల్మోర్ను తిరిగి తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్ఎక్స్లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ఆదివారం ఉదయం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా క్రూ-10 మిషన్ను చేపట్టాయి. ఇందులో భాగంగా ఫాల్కన్-9 రాకెట్ను మూడురోజుల క్రితం ప్రయోగించాలనుకున్నప్పటికీ.. గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషయంలో రద్దు చేశారు.
ఇక శనివారం రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు.టెస్ట్ మిషన్ కోసం బోయింగ్కు చెందిన స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024, జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్.. ఐఎస్ఎస్ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది.