ఐటీసీ కొహినూర్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ లో ఆ ముగ్గురు ఏం చేస్తున్నరు?

'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించిన కేటీఆర్‌

Advertisement
Update:2024-10-02 22:27 IST

హైదరాబాద్‌ లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ లో గల ప్రెసిడెన్షియల్‌ సూట్‌ లో ఆ ముగ్గురు ఏం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్‌ లో నంబర్‌ 2తో అదానీ ఈ రోజు ఎందుకు సమావేశమయ్యారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌ సునీల్‌ కనుగోలు ఏం చేస్తున్నట్టు అని నిలదీశారు. అదానీతో కాంగ్రెస్‌ దోస్తీ కట్టిందా? లేదంటే రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన భూమిని అదానీకి కట్టబెట్టే కుట్ర ఏమైనా చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News