విడిపోతున్నాం.. నటాషా, హార్దిక్ పాండ్యా ప్రకటన

ఇద్దరికీ గుర్తుగా ఆగస్త్య జన్మించాడని, అతని సంతోషం కోసం అవసరమైనది చేస్తామన్నారు. ఆగస్త్యకు కో-పేరెంట్‌గా కొనసాగుతామన్నారు. ఈ కష్ట సమయంలో సపోర్టు కావాలని అభిమానులను కోరారు.

Advertisement
Update: 2024-07-18 19:13 GMT

కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా, నటాషా స్టాంకోవిక్‌ తెరదించారు. విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు విడిపోతున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇది కఠిన నిర్ణయమని స్పష్టం చేశారు.

నాలుగు సంవత్సరాల పాటు కలుసున్న తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు హార్దిక్‌, నటాషా. కలిసి ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయన్నారు. ఈ నిర్ణయం ఇద్దరికీ మంచి చేస్తుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ కలిసి ఓ కుటుంబంగా ఉన్నామని, విడిపోవాలన్న నిర్ణయం కొంచెం కఠినంగా ఉందన్నారు. ఇద్దరికీ గుర్తుగా ఆగస్త్య జన్మించాడని, అతని సంతోషం కోసం అవసరమైనది చేస్తామన్నారు. ఆగస్త్యకు కో-పేరెంట్‌గా కొనసాగుతామన్నారు. ఈ కష్ట సమయంలో సపోర్టు కావాలని అభిమానులను కోరారు. అలాగే వ్యక్తిగత ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

2020, మే 31న నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ పాండ్యా వివాహం జరిగింది. ఇక ఫిబ్రవరి 2023లో మరోసారి క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇన్‌స్టాలో స్టాంకోవిక్‌ తన పేరు చివరన పాండ్యాను తొలగించడంతో విడాకుల రూమర్లు మొదలయ్యాయి. తర్వాత నటాషా, పాండ్యా విడిపోయారంటూ రెడ్డిట్‌ పోస్టు సైతం తర్వాత వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్‌ 2024 మ్యాచులకు నటాషా హాజరుకాకపోవడంతో ఈ ప్రచారం మరింత బలపడింది. తాజాగా ఈ ఇద్దరు విడిపోతున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ధృవీకరించారు.

Tags:    
Advertisement

Similar News