Asha Saini: నా ప్రైవేట్ భాగాలపై కొట్టాడు, తీవ్రంగా హింసించాడు.. ప్రముఖ నిర్మాత పై హీరోయిన్ ఆరోపణలు

Asha Saini: తాను 20 ఏళ్ళ వయసులో కెరీర్ మంచి పీక్ స్థాయిలో ఉన్నప్పుడు బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషిని ప్రేమించానని అయితే అతను తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది.

Advertisement
Update: 2023-02-01 05:31 GMT

ప్రేమకోసం, నర్సింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ప్రేమతో రా వంటి తెలుగు సినిమాలతో పాటు కన్నడ, హిందీ మూవీల్లో కూడా నటించిన ఆశా సైనీ తనపై జరిగిన భౌతిక దాడుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాయాలతో నిండిన ఆమె మొహాన్ని ఆమె తన‌ పోస్ట్ లో షేర్ చేశారు.

తాను 20 ఏళ్ళ వయసులో కెరీర్ మంచి పీక్ స్థాయిలో ఉన్నప్పుడు బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషిని ప్రేమించానని అయితే అతను తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది.

ఆశా సైనీ మాట్లాడుతూ, “నేను ప్రేమలో పడ్డాను, అతను ప్రముఖ నిర్మాత. కానీ వెంటనే పరిస్థితులు మారిపోయాయి... అతను దుర్భాషలాడాడు, అతను నన్ను తీవ్రంగా కొట్టాడు. నా మొహంపై గాయాలయ్యాయి. నా ప్రైవేట్ భాగాలపై కొట్టాడు. అతను నా ఫోన్ తీసేసుకున్నాడు. పని మానేయమని బలవంతం చేశాడు. 14 నెలల పాటు, అతను నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు.ఒకరోజు అతను నా కడుపులో విపరీతంగా కొట్టాడు. ఆ సాయంత్రం నేను పారిపోయాను. నేను అమ్మ, నాన్నతో కలిసి జీవించడం ప్రారంభించాను. నేను కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. కానీ నేను ఈ రోజు సంతోషంగా ఉన్నాను.'' అని చెప్పింది.

అయితే, ఆశా సైనీ తనపై దాడికి సంబంధించి కొద్ది రోజుల క్రితం కూడా మాట్లాడారు... “ఒక రాత్రి, అతను నన్ను చాలా దారుణంగా కొట్టాడు, నాకు దవడ పగిలింది. అతను తన తండ్రి చిత్రాన్ని తీసి, ఈ రాత్రికి నిన్ను చంపేస్తానని మా నాన్నపై ప్రమాణం చేస్తున్నాను అని హెచ్చరించాడు.'' అని ఆమె తెలిపింది.

తనపై జరిగిన దాడి గురించి ఆమె గౌరంగ్ దోషిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. కానీ అతనితో నిరంతరం టచ్‌లో ఉండే పోలీసులు పిర్యాదు తీసుకోవడాని తిరస్కరించారు. అని ఆమెచెప్పింది. 


Tags:    
Advertisement

Similar News