21వ శతాబ్దం భారత్‌దే

భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధిరేటును నడిపిస్తున్న ప్రధాని మోడీ

Advertisement
Update:2025-02-11 12:56 IST

భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటను నడిపిస్తున్నదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత ఇంధన వార్షికోత్సవాలు 2024 ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచంలోని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధిరేటును నడిపిస్తున్నది. మన ఇంధన రంగమూ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వనరులు, మేధో సంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్‌కు నిబద్ధత ఉన్నాయి. సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి.. మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచామన్నారు. మన శిలాజేత ఇంధన శక్తి మూడు రెట్లు పెరిగింది. పారిస్‌ జీ20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొదటి దేశం భారత్‌ అన్నారు. రానున్న రెండు దశాబ్దాలు భారత దేశానికి అత్యంత కీలకమన్నారు. మరో ఐదేళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నాం. 2030 నాటికి నికర జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. అంతేగాక.. ఏటా 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

ప్రధాని ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్నారు. స్వాగత విందు అనంతరం ఏఐ సమ్మిట్‌కు పాల్గొనడానికి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు సాంకేతిక సంస్థల సీఈవోతో పాటు ఇతర ప్రముఖులతో మోడీ సమావేశమయ్యారు. అమెరికా ఎన్నికల్లో గొప్ప విజయం సాధించారంటూ జేడీ వాన్స్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి మోడీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు సహా వ్యాపారవేత్తలతో మోడీ సమావేశం కానున్నారు. భారత్‌, ఐరోపా దేశాల అభివృద్ధితో పాటు మెరుగైన జీవన విధానం కోసం ఏఐని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో మేక్రాన్‌ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని అమెరికా వెళ్తారు.


Tags:    
Advertisement

Similar News