రూ.100 కోట్ల విలువైన బంగారం పట్టివేత
గుజరాత్ లో గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ పై పోలీసుల దాడి;
Advertisement
గుజరాత్ పోలీసులు గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ పై దాడి చేసి రూ.100 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ లోని పాల్ది ప్రాంతంలో ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఒక అపార్ట్మెంట్ లోని ప్లాట్ లో నిల్వ చేసిన వంద కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేసి ఇండియాలో విక్రయిస్తున్నారు.. అహ్మదాబాద్ లో స్వాధీనం చేసుకున్న బంగారంలో ఎక్కువగా అలా స్మగ్లింగ్ చేసి తెచ్చిన బంగారమే ఉందని పోలీసులు తెలిపారు.
Advertisement