Sandeep Reddy | నాలుగేళ్లు.. 2 సినిమాలు

Sandeep Reddy - రాబోయే నాలుగేళ్లలో రెండు సినిమాలు మాత్రమే చేస్తానంటున్నాడు సందీప్. ఆ సినిమాల వివరాలు కూడా బయటపెట్టాడు.

Advertisement
Update: 2024-08-28 08:23 GMT

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన అప్ కమింగ్ మూవీస్ పై స్పందించాడు. ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాతో పాటు.. ఇతర ప్రాజెక్టులు, నటీనటులపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. తన రాబోయే సినిమాలపై ఇప్పటివరకు వచ్చిన అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టాడు.

“నేను నా తదుపరి 2 చిత్రాలను ఇప్పటికే ప్లాన్ చేసాను. రాబోయే నాలుగేళ్లు ఈ ప్రాజెక్టులపైనే ఉంటాను.’’ అని క్లారిటీ ఇచ్చాడు సందీప్ వంగ. ప్రభాస్ తో అతడు స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాల్సి ఉంది. దీని కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు సందీప్ రెడ్డి. 2026లో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఆ తర్వాత రణబీర్ తో కలిసి యానిమల్ పార్క్ సినిమా ప్రారంభిస్తాడు. ఈ రెండు సినిమాలకు తనకు నాలుగేళ్లు పడుతుందని సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు వచ్చిన వార్తల్ని సందీప్ రెడ్డి ఖండించాడు. బన్నీకి తను కథ వినిపించలేదని స్పష్టత ఇచ్చాడు. ఓవైపు వివాదాలు, మరోవైపు విమర్శలు ఉన్నప్పటికీ.. సందీప్ రెడ్డి సినిమాలు జనాల్ని ఆకర్షిస్తున్నాయి. యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా హిట్టయింది. రణబీర్ కు సూపర్ స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. 

Tags:    
Advertisement

Similar News