విరామం త‌ర్వాత స‌మంత జోరు.. మ‌రో సిరీస్ కు గ్రీన్ సిగ్న‌ల్‌

ది ఫ్యామిలీ మ్యాన్‌, సిటాడెల్‌:హనీ బన్నీ సిరీస్‌ల కోసం ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్‌ అండ్‌ డీకేలతో చేతులు కలిపిన సమంత.. ముచ్చ‌ట‌గా మూడోసారి వారితో క‌లిసి మ‌రో కొత్త సిరీస్ కు వ‌ర్క్ చేయ‌బోతోంద‌ట‌.

Advertisement
Update: 2024-06-29 09:08 GMT

మయోసైటిస్ అనే వ్యాధితో గ‌త రెండేళ్ల నుంచి బాధ‌ప‌డుతున్న సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత‌.. ఖుషి మ‌రియు బాలీవుడ్ వెబ్ సిరీస్‌ సిటాడెల్ పూర్తి చేసి బ్రేక్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఫుల్ ఫోక‌స్ హెల్త్ పైనే పెట్టింది. మయోసైటిస్ వ్యాధికి విదేశాలు వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంది. అయితే షూటింగ్స్ నుంచి కొంత కాలం విశ్రాంతి తీసుకున్న స‌మంత ఇప్పుడు మ‌ళ్లీ రీఎంట్రీకి రెడీ అయింది.

వ‌రుస‌గా కొత్త ప్రాజెక్ట్ ల‌ను లైన్ లో పెడుతూ విరామం త‌ర్వాత జోరు చూపిస్తోంది. ఇప్ప‌టికే మా ఇంటి బంగారం పేరుతో స‌మంత ఒక సినిమాను అనౌన్స్ చేసింది. ఇందులో ఆమె మెయిన్ లీడ్ లో యాక్ట్ చేయ‌డ‌మే కాకుండా ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌మంత హోమ్ బ్యాన‌ర్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. స‌మంత తాజాగా బాలీవుడ్ లో మ‌రో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ది ఫ్యామిలీ మ్యాన్‌, సిటాడెల్‌:హనీ బన్నీ సిరీస్‌ల కోసం ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్‌ అండ్‌ డీకేలతో చేతులు కలిపిన సమంత.. ముచ్చ‌ట‌గా మూడోసారి వారితో క‌లిసి మ‌రో కొత్త సిరీస్ కు వ‌ర్క్ చేయ‌బోతోంద‌ట‌. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కు రక్తబీజ్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. అలాగే ఈ సీరిస్ లో బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌, స‌మంత జంట‌గా క‌నిపించ‌బోతున్నార‌ని.. ఆగ‌స్టులో షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని బాలీవుడ్ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో గ‌ట్టిగా టాక్ న‌డుస్తోంది.

కాగా, ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 ద్వారా స‌మంత నార్త్ లో బాగా పాపుల‌ర్ అయింది. ఇందులో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న రాజి పాత్ర‌లో చెల‌రేగిపోయింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత యాక్ట్ చేసిన సిటాడెల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఇంత‌లోనే ఆమె మ‌రో సీరిస్ కు శ్రీ‌కారం చుట్టింద‌ని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News